విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో కొనసాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా సెయిల్లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. …
Read More »తిరుమల డిక్లరేషన్ వివాదం.. నా మతం ఇదే, కావాలంటే రాసుకోండి.. వైఎస్ జగన్ ఎమోషనల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి …
Read More »అల్లూరి జిల్లా: వాగు ఒడ్డున బంగారు వర్ణంలో హనుమాన్ విగ్రహం.. చూసేందుకు జనం క్యూ, ప్రత్యేక పూజలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులో హనుమాన్ విగ్రహం కొట్టుకువచ్చింది. రాజవొమ్మంగి మండలం జడ్డంగి దగ్గర మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం వరదకు కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది. వాగు నీటి నుంచి ఒడ్డుకు చేరి ఇసుక దిబ్బల్లో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. హనుమంతుడి విగ్రహం బంగారు వర్ణంలో మెరిసిపోయింది.. విగ్రహాన్ని ఇసుక నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి జడ్డంగి రామాలయంలో ఉంచారు. హనుమాన్ విగ్రహాన్ని మంచి ముహూర్తం చూసి ప్రతిష్ఠిస్తామని గ్రామ …
Read More »విజయవాడ: నీళ్లలో తిరిగి కాలు పోగొట్టుకున్న బాలుడు.. ఆ బ్యాక్టీరియా చాలా డేంజర్
ఇటీవల వరదలు విజయవాడతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. అయితే వరద నీటిలో తిరిగిన ఓ బాలుడు కాలును పోగొట్టుకున్నాడు. నీళ్లలో తిరిగితే కాలు పోయిందా అంటే.. దీనికి వెనుక కారణం ఉంది. ఒక బ్యాక్టీరియా కారణంగా బాలుడు కాలును కోల్పోవాల్సి వచ్చింది.. రెండో కాలుకు కూడా ఆ బ్యాక్టీరియా సోకింది. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న కొత్తా నాగరాజు ప్రైవేట్ కంపెనీలో.. కోడలు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుమారుడు భవదీప్ ఏడో తరగతి చదువుతున్నాడు. భవదీప్ …
Read More »ఏపీలో మద్యం దుకాణాలు రద్దు.. చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం
AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాప్లను రద్దు చేస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం …
Read More »టీటీడీ ఈవోతో కేఎంఎఫ్ (నందిని డెయిరీ) ప్రతినిధుల భేటీ.. ఎందుకంటే!
టీటీడీ ఈవో జే శ్యామలరావును కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డైరీ) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డైరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో గౌతమి, కేఎంఎఫ్ ఎండి ఎంకె జగదీష్, డైరెక్టర్లు రఘునందన్, రాజశేఖర్ మూర్తి, మంజునాథ్ పాల్గొన్నారు. ప్రధానంగా నెయ్యి నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు, దేశంలో ఎక్కడెక్కడకు పాలు, నెయ్యి సరఫరా చేస్తున్నారనే అంశాలను వివరించారు. అలాగే …
Read More »వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. వైసీపీలో కీలక మార్పులు, వాళ్లందరికి పదవులు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో మార్పులు, చేర్పులు మొదలుపెట్టారు. అన్ని జిల్లాలకు కొత్తగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు.. తాజాగా మరో మూడు జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులను మార్చారు. విశాఖపట్నం జిల్లాకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును అధ్యక్షులుగా నియమించారు. 2024 ఎన్నికల ముందు పంచకర్ల రమేష్బాబు పార్టీని వీడటంతో.. విశాఖపట్నం జిల్లాకు …
Read More »కేంద్రంలో టీడీపీ ఎంపీకి కీలక పదవి.. మరో బీజేపీ ఎంపీకి అవకాశం
ఏపీలో కూటమికి చెందిన ఇద్దరు ఎంపీలకు రెండు కీలకమైన పదవులు దక్కాయి. ఇద్దరికి పార్లమెంటు స్థాయీసంఘాల ఛైర్మన్ పదవులు దక్కాయి. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయీసంఘం ఛైర్మన్గా టీడీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నియమించారు. రైల్వేశాఖ స్థాయీసంఘం ఛైర్మన్గా అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం బులెటిన్ను విడుదల చేసింది. అలాగే పర్యాటక, రవాణా, సాంస్కృతిక స్థాయీసంఘం ఛైర్మన్గా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసారి ఆ పదవి కోల్పోయారు. టీడీపీ ఎంపీ కేశినేని …
Read More »తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటి.. టీటీడీ నిబంధన ఇదే, జగన్ నుంచి డిక్లరేషన్ కోరనున్న అధికారులు?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన శ్రీవారి దర్శనానికి వెళుతుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలో జగన్ బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి.. ముందుగానే ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు.. ఒకవేళ తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని …
Read More »తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్కు రాబోతుంది. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు …
Read More »