పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 20న జరిగిన ఏపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు సుమారు 1500 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆ టూర్కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ శ్యామ్, జిల్లా ఎస్పి మాధవ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే..డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో …
Read More »సంక్రాంతికి ఊరెళ్లేవారికి అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది
సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికోసం సొంత గ్రామాలకు వెళ్లేందుకు అందరూ సిద్ధం అవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ మహానగరం సగానికిపైగా ఖాళీ అయిపోతుంది. మరి దీనికోసం ఏపీఎస్ఆర్టీసీ ఏయే ప్రణాళికలు చేసిందంటే..ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారి కోసం తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. త్వరలో వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లు రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ లభ్యమవుతాయంటే..
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యకమాల గురించి భక్తులకు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామని చెప్పారు.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు …
Read More »క్లాస్ రూమ్లో ఒంటరిగా విద్యార్థిని.. ఆమె వద్దకు వెళ్లి ప్రొఫెసర్ వికృత చేష్టలు
తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్తో ఉమామహేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఉమామహేష్ను అదుపులోకి తీసుకొని తిరుపతి రూరల్ పీఎస్కు తరలించారు పోలీసులు.టెంపుల్ సిటీలో ఆచార్యుడి వక్రబుద్ధి బయట పడింది. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆచార్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర …
Read More »కలుపు తీస్తోన్న గిరిజనుడిపైకి దూసుకువచ్చి చుట్టేసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత
పొలంలో పనులు చేస్తున్న జన్ని రాము అనే గిరిజనుడిపై కింగ్ కోబ్రా అకస్మాత్తుగా దాడి చేసింది. సుమారు పది అడుగుల పొడవుతో భయానకంగా ఉన్న కింగ్ కోబ్రా పెద్ద పెద్దగా బుసలుకొడుతూ జన్ని రాముపై దాడి చేయడంతో ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురయ్యాడు. పొలం పనిలో నిమగ్నమైన గిరిజనుడికి ఎదురైన ఈ ఘటన స్థానికులను సైతం గగుర్పాటుకు గురి చేసింది.జన్ని రాము ప్రతిరోజు పొలం పనులకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే రాము ఉదయాన్నే జీడి మామిడి తోటకెళ్లి …
Read More »హనీట్రాప్ కేసులో సంచలన ట్విస్ట్.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!
విశాఖ హనీట్రాప్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో ముగ్గురిని అరెస్ట్ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని సూచించారు. మరోవైపు నిందితుల అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.సంచలనాలకు కేరాఫ్గా మారింది విశాఖ హనీట్రాప్ కేసు. రోజుకో అప్డేట్.. పూటకో ట్విస్ట్తో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న క్రైమ్ కథా చిత్రంగా తయారైంది. ఆ మధ్య జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు ఇవ్వడం.. …
Read More »సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకున్న రైతు కుటుంబం.. కన్నీరు పెట్టిస్తున్న నలుగురి మృతి!
అప్పుల భారం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో జరిగిందీ విషాదం. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు, 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేశాడు. అయితే అప్పుల బాధ తాళలేక పొలం దగ్గరే ఉరివేసుకుని రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రైతన్న కంట కన్నీరు ఆగడం లేదు.. ఎక్కడో ఒకచోట ఏదో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటూనే …
Read More »సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతిలో భూముల ధరలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్కు బూమ్ వచ్చింది. మరి సామాన్యులకు గుడ్ న్యూస్ అందించేలా.. అక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..ఏపీలో ఆరునెలల కిందట టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కసారిగా బెలూన్కు గాలి ఊదినట్లుగా.. ఏపీలో రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్లిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇలా ఒక్కసారిగా గాలి కొడితే బెలూన్లు పేలిపోయినట్లు రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగి పడిపోతుంది …
Read More »హ్యాట్సాఫ్.. మహిళా ఎస్సై..! మృతదేహాన్ని భుజాన వేసుకుని..!
విశాఖపట్నం మహిళ ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అధికారి అన్న విషయం మరిచిపోయారు. రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పంచనామా నిర్వహించిన పోలీసలు, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ప్రాంతానికి వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తానే స్వయంగా మృతదేహాన్ని భుజాన మోస్తూ తీసుకెళ్లారు ఎస్ఐ సూర్యకళ.అది విశాఖ గాజువాక ప్రాంతం.. జగ్గయ్యపాలెం రైల్వే క్యాబిన్ కు సమీపంలో ఓ డెడ్ బాడీ..! దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. సమాచారం …
Read More »ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
110 మంది పోలీసులు, 11 బ్రృందాలు 24 గంటలు పని చేస్తే కేసును ఛేదించడానికి ఏడు రోజులు సమయం పట్టింది.. కేవలం 7 తరగతి చదివిన తిరుమాని శ్రీధర్ వర్మ అలియాస్ చేకూరి శ్రీధర్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకే సవాల్ విసిరాడు. నేరం ఎలా చేయాలి, దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, పట్టుకున్నా శిక్ష పడకుండా ఎలా బయట పడాలి. ఈ త్రిముఖ వ్యూహంతో ఆపరేషన్ సిద్ధ – చేప పేరుతో క్రైం కథ నడిపాడు.ఏంటి ఈ ఆపరేషన్ సిద్ధ? ఉండి మండలం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal