తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్కు స్వస్థి చెప్పేందుకు సిద్ధమైంది. థర్డ్ ఇయర్లో కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇందుకోసం డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్ను పూర్తిగా తొలగించింది. దీంతో ఇకపై డిగ్రీ ఫస్ట్, సెకండియర్లోనే ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది కూడా. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి ఇదేమీ కొత్త విధానం కాదు. …
Read More »గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్క్లియర్.. ఆ ఏడు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీఎస్పీఎస్సీ)ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే పిటిషన్ల దాఖలు ఆలస్యం కావడాన్ని తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన జీవో 29 అప్లోడ్ కాలేదన్న కారణాన్ని తోసిపుచ్చింది. ప్రిలిమ్స్ …
Read More »ఏటా ఆలస్యంగా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్.. ఏడాది ముగుస్తున్నా కొలిక్కిరాని ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యేటా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్య మవుతుండటంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా విద్యా సంవత్సరం ముగుస్తున్న ఇంకా ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తి కాలేదు. దీంతో విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో విద్యా సంవత్సరం ముగింపు వరకు ప్రవేశాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఫలితంగా తరగతులు ఆలస్యంగా మొదలై చివరన …
Read More »మరోవారంలో యూజీసీ- నెట్ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 (యూజీసీ- నెట్) పరీక్షలు సమీపిస్తున్నాయి. మరోవారంలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూజీసీ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు వంటి వివరాలు ఉంటాయి. ఇక మరో రెండు మూడు రోజుల్లో అడ్మిట్ కార్డులు కూడా విడుదల కానున్నాయి. …
Read More »విద్యార్ధులకు గుడ్న్యూస్.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే
తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్ విద్యార్థులకు నేటి నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తూ ఇప్పటికే రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచే స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా స్కూళ్లలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించారు. దీంతో డిసెంబర్ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్గా ప్రకటించారు. డిసెంబర్ 25న …
Read More »టెన్త్ విద్యార్ధులకు అత్యధిక మార్కులు వచ్చేలా.. వంద రోజుల ప్రణాళిక అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు మార్చి నెలలో జరగనున్న పబ్లిక్ పరీక్షల కోసం సర్కార్ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. పరీక్షల్లో విద్యార్ధులు అత్యుత్తమ మార్కులు సాధించేలా అదనపు తరగతులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి …
Read More »యూజీసీ నెట్ 2024 (డిసెంబర్) పరీక్షల తేదీలు మారాయోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే
జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, పీహెచ్డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 (యూజీసీ- నెట్) పరీక్ష తేదీలు మారాయి. …
Read More »పెద్దాపూర్ గురుకులంలో వరుస పాముకాట్లు.. 2 రోజుల్లో ఇద్దరు విద్యార్ధులు ఆస్పత్రిపాలు
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. గురుకుల పాఠశాలల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఫుడ్ పాయిజన్, పాముకాట్లు.. సంగతి సరేసరి. ఇప్పటికే ఎందరో ఆస్పత్రి పాలవగా.. కొందరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులకు పాముకాటుకు గురయ్యారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు సమస్యల నిలయంగా మారాయి. ఇటీవల కాలంలో వరుస ఫుడ్ పాయిజన్లు, పాముకాట్లు, విద్యార్ధులు ఆత్మహత్యలతో పలువురు విద్యార్ధులు తనువు చాలించారు. …
Read More »తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీన ఏ పరీక్షంటే
తెలంగాణ పదో తరగతి విద్యార్ధుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురువారం (డిసెంబర్ 19) విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీ కోసం..తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ …
Read More »కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షల కాల్లెటర్లు వచ్చేశాయ్! డౌన్లోడ్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల అడ్మిట్ కార్డులు గురువారం (డిసెంబర్ 19) విడుదలయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నియామక ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తవగా 95,209 మంది అభ్యర్ధులు తదుపరి దశ అయిన దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. ఇక ఇప్పటికే పోలీసు నియామక మండలి పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది..ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షకు మార్గం సుగమం అయ్యింది. దేహ దారుఢ్య …
Read More »