విద్యా బోధనలు నేర్పించే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మత ప్రచారం చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్ను పంపిణీ చేశాడు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఉపాధ్యాయుడితో ఆందోళనకు దిగారు.ప్రభుత్వ పాఠశాల మత ప్రచారం కేంద్రంగా మారింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మత బోధకుడిగా మారిపోయాడు. ఏకంగా విద్యార్థులకు బైబిల్ పంపిణి చేశాడు. ఈ విషయం పేరెంట్స్కి తెలియడంతో ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రాజన్న …
Read More »AP Inter Exam Schedule: మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల
ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయని విద్యాశాఖ తెలిపింది. అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ .. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Read More »మార్చి 17 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 31న ముగియనున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వానికి అందిచింది. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష షెడ్యూల్ను ఏపీ విద్యాశాఖ అమోదించిన తర్వాత షెడ్యూల్ను ఖరారు చేశారు. మరోవైపు ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ కోసం షెడ్యూల్ను రాష్ట్ర …
Read More »మధ్యాహ్నం ఒంటిగంట.. పుస్తకాలను తలగడగా పెట్టుకుని హాయిగా బజ్జున్నారు.. కట్ చేస్తే..
రంగు రంగుల బెంచ్ల మధ్యలో ఒకాయన హాయిగా నిద్రపోతున్నారు. బెంచ్ల మధ్యలో పడుకున్న ఆయన తలకింద ఏకంగా పుస్తకాల కట్ట ఉంది.. ఆయన తలగడగా దానిని పెట్టుకున్నారు. పక్కనే మంచినీళ్ల బాటిల్ కూడా ఉంది. అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఒక స్కూల్లోని తరగతి గది అని అర్ధమవుతోంది.రంగు రంగుల బెంచ్ల మధ్యలో ఒకాయన హాయిగా నిద్రపోతున్నారు. బెంచ్ల మధ్యలో పడుకున్న ఆయన తలకింద ఏకంగా పుస్తకాల కట్ట ఉంది.. ఆయన తలగడగా దానిని పెట్టుకున్నారు. పక్కనే మంచినీళ్ల బాటిల్ కూడా ఉంది. …
Read More »మాకు పాఠాలు చెప్పండి మహాప్రభో.. ఉపాధ్యాయులపై విద్యార్థుల ఫిర్యాదు..!
ఉపాద్యాయులపై విద్యార్దుల ఫిర్యాదు చేశారు. సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ డీఈవోకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. స్కూల్కు వస్తున్నాం కానీ పాఠాలు వినడం లేదని, ఉపాధ్యాయులు పాఠాలు చెబితే ఎందుకు వినమని విద్యార్థులు ఉన్నతాధికారులకు రాసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.. మాకు పాఠాలు చెప్పండి మహా ప్రభో అంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆ పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్దులు ఆశ్రయించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి మండలంలోని …
Read More »తెలుగోళ్ల సత్తా.. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూకి 90 మందికిపైగా అర్హత! పూర్తి లిస్ట్ ఇదే
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను డిసెంబర్ 9న సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్టికెట్ నంబర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదికి మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై …
Read More »తెలుగు రాష్ట్రాల్లో కానిస్టేబుల్ కొలువులకు ఉచిత కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సర్కార్ కొలువు దక్కించుకోవాలనేది ఎందరికో కల. కానీ కొందరికే అది సాధ్యం అవుతుంది. ఇందుకు గల అనేకానేక కారణాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఒకటి. అయితే ఒక్క రూపాయి చెల్లించకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలోనే నిర్వహించనున్న కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉచితంగా శిక్షణ పొందవచ్చు..కేంద్ర సాయుధ బలగాల్లో బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్, రైఫిల్మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి …
Read More »ఇక ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్లకు దబిడిదిబిడే.. కీలక ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను అందరికీ కనిపించే విధంగా బడుల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన టీచర్ల స్థానంలో ఇతర ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయని. ఇలా ఒకరికి …
Read More »గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. పరీక్షలు యథాతథం
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదాను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. గ్రూప్ 2 పరీక్ష, ఆర్ఆర్బీ పరీక్ష ఒకే రోజు ఉండటంతో గ్రూప్ 2ను రీషెడ్యూల్ చేయాలని పేర్కొంటూ సుమారు 22 మంది అభ్యర్ధులు పిటీషన్లు దాఖలు చేయగా.. వీటిని విచారించిన కోర్టు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తైనందున వాయిదా వేయలేమంటూ..తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హాల్ టికెట్లు కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని …
Read More »ఏఐ జమానా.. ఎగబడి కోర్సుల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులు
2024-25 అకడమిక్ సెషన్లో 4,538 పాఠశాలల నుండి దాదాపు 7,90,999 మంది విద్యార్థులు సెకండరీ స్థాయిలో (IX , X తరగతులు కలిపి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. సీనియర్ సెకండరీ స్థాయిలో (XI, XII తరగతులు కలిపి), 944 పాఠశాలల నుండి 50,343 మంది విద్యార్థులు AIని ఎంచుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. AI విద్య యొక్క ప్రాముఖ్యతను కేంద్రమంత్రి జయంత్ చౌదరి వివరించారు. 2019లో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal