ఎడ్యుకేషన్

ఇవాళ్టి నుంచి MBBS, MDS ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. కటాఫ్‌ ఎంతంటే?

Telangana KNRUHS NEET UG 2025 counselling: రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (KNRUHS) మంగళవారం (జులై 15) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు.. తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (KNRUHS) మంగళవారం (జులై 15) నోటిఫికేషన్‌ విడుదల …

Read More »

ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఎప్పుడిస్తారంటే?

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ గురుకులాల్లో ఇంటర్‌ చదివిన విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పాఠశాలల్లో ఇంటర్‌ పాసై 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీల్లో సీటు సాధించిన వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే పది, ఇంటర్‌లో ప్రతి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురి చొప్పున విద్యార్ధులకు నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు కూడా బహుమతులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ …

Read More »

ఇక ఆ వారంలో వరుసగా 2 రోజుల సెలవులు.. తెరపైకి సరికొత్త డిమాండ్‌

వేసవి సెలవుల తర్వాత జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరుచుకున్న తర్వాత అన్ని పాఠ్యాంశాలతో బిజీగా తరగతులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు పాఠశాలల విషయంలో ఓ డిమాండ్‌ మరింతగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌లోని పాఠశాలలకు రెండవ శనివారం సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ క్యాలెండర్‌లో రెండవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయని పేర్కొన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌ అన్ని చోట్ల సెలవు ఇవ్వడం లేదు. దీంతో సెలవులు అమలు కచ్చితంగా జరగాలని డిమాండ్ ఉంది. హైదరాబాద్ పాఠశాలల సెలవు …

Read More »

 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల క్వశ్చన్ పేపర్ మారుతుందోచ్‌.. కొత్త మార్పులు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రంలో పలు మార్పులు చోటు చేసుకోకున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లోని సృజనాత్మకత పరిశీలించేలా ప్రశ్నాపత్రంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సీబీఎస్‌ఈ బోర్డుతో పోల్చితే రాష్ట్ర బోర్డుల్లో ఉత్తీర్ణత తక్కువగా నమోదు అవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. పదో తరగతి ఫలితాల్లో గణనీయంగా ఫెయిలౌతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నట్లు …

Read More »

ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజు పెంపుకు CBITకి హైకోర్టు అనుమతి.. నేడు తుది తీర్పు!

2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల ఫీజును పెంచుకునేందుకు చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. CBIT వసూలు చేసే ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని TG Eapcet అడ్మిషన్ల కన్వీనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఆదేశించారు. బీటెక్‌ కోర్సులకు ఏడాదికి రూ.2,23,000గా, MTech కోర్సుకు రు.1,51,600, MBA/MCA కోర్సుకు రు.1,40,000లకు పెంచేందుకు కోర్టు CBITని అనుమతించింది. పెరిగిన …

Read More »

తెలంగాణ నీట్‌ యూజీ 2025 ర్యాంకర్ల లిస్ట్‌ వచ్చేసింది.. ఫుల్‌ జాబితా ఇదే!

నీట్‌ యూజీ 2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 43,400 మంది అర్హత సాధించారు. ఈ మేరకు ఎంపిక జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. ఇది కేవలం నీట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు తెలిపే జాబితా మాత్రమేనని, మెరిట్‌ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్, ఎస్‌సీసీఎల్‌ మెరిట్‌ జాబితాను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. …

Read More »

ఇంజినీరింగ్, MBBSలో సీటు పొందిన విద్యార్థులకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, నీట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. గురుకుల విద్యార్థులకు 11 కాస్మొటిక్‌ వస్తువులను కిట్‌ రూపంలో …

Read More »

గురుకుల విద్యార్ధులకు భలే ఛాన్స్.. నారాయణ విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్‌ ఉచిత కోచింగ్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, నీట్‌లో అతి కొద్దిమార్కుల తేడాతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్‌ లాంగ్‌ టర్మ్‌ ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో ఇప్పటికే మంత్రి నారాయణ చర్చించారు కూడా. ఇందులో భాగంగా ఈ ఏడాదికి మొత్తం 80 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ …

Read More »

ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌… కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్‌

ఏపీలో ఇవాళ పేరెంట్‌-టీచర్‌ మెగా మీటింగ్‌ టు పాయింట్‌ వో జరగబోతోంది. 2 కోట్ల 28 లక్షల మందికి పైగా భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పాల్గొననున్నారు. పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయనున్నారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌… తల్లిదండ్రుల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ల పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టుపై మాట్లాడుకోవడం… కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను గవర్నమెంట్ …

Read More »

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు.. ఈసారి కన్వీనర్‌ కోటా సీట్లు ఎన్ని ఉన్నాయంటే?

రాష్ట్ర వ్యప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ గడువును జులై 9 వరకు పొడిగించినట్లు జేఎన్టీయూ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి. బాలునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. జులై 7న మొత్తం 900 విద్యార్థులకు గాను 806 మంది కౌన్సెలింగ్ హాజరయ్యారు. కాగా ఈసారి మొత్తం 171 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో.. 1.14 లక్షలకుపైగా బీటెక్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో కన్వీనర్‌ …

Read More »