బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నినట్టు ముంబయి క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కీలక అంశాలు బయబకు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్.. కాల్పుల జరపడానికి ముందు షూటర్లకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరికీ అతడు 9 నిమిషాల పాటు …
Read More »కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత 21 ఏళ్ల తర్వాత ఆర్మీ భారీ ఆపరేషన్
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పాక్లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం భారీ ఆపరేషన్కు వ్యూహరచన చేసింది. ఉగ్రవాదుల ఏరివేతకు ఇప్పటికే 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో …
Read More »విశాఖలో యువకుడికి మ్యాట్రీమోనీ మోసం
యువకులు మ్యాట్రీమోనీలో పెళ్లి సంబంధాల కోసం చూస్తుంటారు. తమకు నచ్చిన అమ్మాయి కోసం రిక్వెస్ట్లు పంపుతుంటారు. అవతలి వైపు నుంచి అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంబంధం సెట్టు.. అయితే మ్యాట్రీమోనీ రిక్వెస్ట్లు, అమ్మాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు. అమ్మాయి అందంగా ఉంది కదా అని టెంప్ట్ అయితే నిండా మునిగిపోయినట్లే.. అందుకే మ్యాట్రీమోనీ విషయంలో జాగ్రత్తలు తప్పవు మరి. తాజాగా విశాఖపట్నంలో అదే జరిగింది.. ఓ యువకుడు మ్యాట్రీమోనీలోకి వెళ్లి ఓ మహిళ చేతిలో మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో …
Read More »టికెట్ లేకుండా ప్రయాణం.. ఆపై కేంద్ర మంత్రి తెలుసంటూ వార్నింగ్.. టీటీ షాక్!
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ ప్రయాణికుడు.. టీటీఈ బెదిరించాడు. టిక్కెట్ ఏదని అడిగితే.. తనకు కేంద్ర మంత్రి తెలుసంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో టీటీఈ సహా తోటి ప్రయాణికులంతా విస్తుపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని మథుర జంక్షన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణించేవారిని గుర్తించేందుకు మథుర జంక్షన్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ధోలాపుర్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడ్ని రైల్వే స్టేషన్లో టీటీఈ ఆపి టికెట్ చూపించమని అడిగారు. టిక్కెట్ లేకుండా …
Read More »జమ్మలమడుగులోని పొలాల్లో సిరంజీల కలకలం..
కడప జిల్లా జమ్మలమడుగులో సిరంజీలు కలకలంరేపాయి. జమ్మలమడుగు బైపాస్ నుంచి శేషారెడ్డిపల్లె వెళ్లే మార్గంలో పొలాల గట్ల వెంట వాడి పడేసిన సిరంజీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రైల్వే గేటు దాటగానే రోడ్డు పక్కన 2.5 ఎం.ఎల్ సిరంజీలు సూదితో సహా గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. పొలాల్లో, గట్లపై ఈ సిరంజీలు ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరంజీలు రక్త పరీక్షలవా? మత్తు పదార్థాల కోసం వాడినివా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో ఇలాంటి సిరంజీలు ఎప్పుడూ చూడలేదని రైతులు, …
Read More »బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి మృతి
గుజరాత్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి …
Read More »పెద్దపల్లి జిల్లాలో ఘోరం.. బాలికపై హత్యాచారం
పెద్దపల్లి: జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక అత్యాచారం.. ఆపై హత్యకు గురైంది. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. అరెస్ట్ చేశారు. బలరాంపై పోక్సో యాక్ట్, హత్యానేరం కింద …
Read More »Kuwait లో అగ్నిప్రమాదం – స్వదేశానికి 45మంది భారతీయుల మృతదేహాలు
కువైట్ సిటీ : గత బుధవారం తెల్లవారుజామన కువైట్లోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్పోర్టుకు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్న భారభరితంగా మారిపోయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, బిజెపి …
Read More »71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
ఏప్రిల్ నెల నివేదికను విడుదల చేసిన వాట్సప్నిబంధనలు ఉల్లంఘించే ఖాతాలపై ప్రత్యేక దృష్టిసైబర్ ఫ్రాడ్.. మోసాలు..హానికరమైన కంటెంట్లు ప్రచురించే అకౌంట్లకు చెక్ ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులపై శ్రద్ధవహిస్తూనే ఉంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. ఇవే కాకుండా తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని భారతీయ ఖాతాలపై …
Read More »కువైట్ లో అగ్నిప్రమాదం.. వారికి మోడీ సర్కార్ రూ. 2 లక్షల సాయం
Kuwait Fire: కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్కల్యాణ్ మార్గ్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. …
Read More »