తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అవినీతి ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలను ముమ్మరం చేసింది, గత ఆరు నెలల్లో మొత్తం 122 కేసులు నమోదు చేసింది. ఇది గత సంవత్సరం మొత్తం కేసులను అధిగమించింది. ప్రధాన ట్రాప్ కేసుల్లో GHMC, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. అవినీతికి పాల్పడే అధికారులకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వాలని ACB పౌరులను కోరుతుంది.తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమార్కులపై దృష్టి సారించారు. ఏసీబీ అధికారులు ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో …
Read More »పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు ఉన్నాడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరుగుద్ది
శంకర్పల్లిలో 6 ఎకరాలు, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ శివార్లలో ఒక విల్లా, 4 ఫ్లాట్లు, కిలో బంగారం, 80 లక్షల మేర బ్యాంకు బ్యాలెన్సు..! 50 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖలో పట్టుబడ్డ ఓ చిరుద్యోగి దగ్గర దొరికిన అంతులేని సంపద ఇది. వాసనొచ్చి గాలమేసి పట్టుకుంటే.. ఇటువంటి తిమింగలాలు తెలంగాణలో లెక్కలేనన్ని. మా ట్రాప్లో చిక్కిన సొరచేపల లిస్ట్ ఇదీ అని బైటపెట్టింది ఏసీబీ.నూనె శ్రీధర్ ఎపిసోడ్ తెలంగాణలో ఒక కేస్ స్టడీ మాత్రమే. నూనె శ్రీధర్ …
Read More »ఇలాంటివి మళ్లీ రిపీట్ అయితే.. చట్టపరమైన చర్యలు తప్పవు- TGSRTC ఎండీ సజ్జనార్!
ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల దుండగుల చేతిలో దాడికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డ్రైవర్ విద్యాసాగర్ను పరామర్శించిన తర్వాత సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మెహదీపట్నం …
Read More »ముందు తలలో నాలుకలా మెలిగాడు – అందరికీ నమ్మకం కుదిరాక దుకాణం బంద్
భవిష్యత్తు అవసరాల కోసం కొందరు కూలీ, నాలీ చేసుకుని.. మరికొందరు రేయింబవళ్లు కష్టపడి పైసాపైసా కూడబెడతారు. అవసరానికి పనికి వస్తాయని చిట్టీలు వేస్తారు. కుటుంబ అవసరాల కోసం చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో పొదుపు చేసుకుంటారు. అమాయక ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని ఓ వ్యాపారి బిచానా ఎత్తివేశాడు. చిట్టీల పేరుతో నమ్మకంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యాపారి బురిడి కొట్టించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతినగర్కాలనీకి చెందిన కటకం సైదిరెడ్డి నివాసమున్నాడు. తన మంచి మాటలతో కాలనీవాసులందరినీ పరిచయం చేసుకున్నాడు. కాలనీ …
Read More »రైతన్నలూ అదిరేటి ఆఫర్ అని టెమ్ట్ అవ్వొద్దు.. పంట పండకపోతే అసలుకే మోసం
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మిర్చి, పొగాకు, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించలేదు. దీంతో రైతులు కొంతమేర ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలతో ముందస్తుగా సాగుకు సిద్దమైనా.. ప్రస్తుతం వానలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగటం లేదు. దీంతో విత్తనాలకు డిమాండ్ లేకుండా పోయింది. ప్రతి ఏటా ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేసి నాటడం కూడా మొదలు పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల …
Read More »చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నాడో.. పెళ్లి అయ్యాక అందర్నీ వదిలేసి మెట్టినింటికి వచ్చిన ఆమెను..
కొత్త జీవితం మొదలై రెండు నెలలే అయింది.. ఇంతలోనే భర్త వేధింపులు మొదలయ్యాయి.. అటు భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది.. ఇటు పుట్టింటికి ఏం చేప్పాలో అర్ధం కాలేదు.. దీంతో ఆమె జీవితం ఉక్కిరిబిక్కిరైంది.. పెళ్లైన రెండు నెలలకే భర్త టార్చర్ తో జీవితం మీద విరక్తి ఏర్పడింది.. మనస్థాపంతో కుమిలిపోయింది.. చివరకు ప్రాణాలు తీసుకునేలా దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.. భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ …
Read More »ఆ ఇళ్లే వారి టార్గెట్.. ఒకే రోజు రెండు చోరీలు.. వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?
విజయవాడలోని సత్యనారాయణ పురం పోలీసుల స్టేషన్ పరిధిలో ఒకే రోజు రెండు చోరీలు జరగడం స్థానికులను తీవ్ర భయాదోంళనకు గురిచేస్తోంది. ఇంటి యాజమానులు విదేశాలకు వెళ్లారన్న పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లోని బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తలుపు తెరిచి ఉండడంతో యజమానికి సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ మధ్య కాలంలో దొంగతనాలు, దొపిడీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు!
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితరచూ ఎదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇటీవల హుజురాబాద్కు చెందిన ఓ గ్రానైట్ వ్యారిని బెదిరించి రూ.50లక్షలు డిమాండ్ చేశాడని బాధితులు సుబేదార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. అతని ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ 21వ తేదీన కౌషిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5) 352 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిని …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కేంద్రమంత్రి బండి సంజయ్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సిట్ ?
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఆయనకు పోన్ చేసిన సిట్ అధికారులు.. గత బీఆర్ఎస్ హాయాంలో మీ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని..ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం తీసుకునేందుకు …
Read More »టోలిచౌకిలో పోలీసుల కార్డెన్ సర్చ్.. అక్రమంగా నివసిస్తున్న 18 మంది విదేశీయుల గుర్తింపు!
వీసాల గడువు ముగిశాక కూడా అక్రమంగా భారత్లో నివసిస్తున్న విదేశీయులను గుర్తించే పనిలో పడ్డారు హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు. ఇందలో భాగంగానే శుక్రవారం టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా మౌంట్ కాలనీలో కార్డన్ సర్చ్తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీసాల గడువు పూర్తైన అక్రమంగా ఇక్కడే నివసిస్తున్న 18 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు.గత ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో ఇలాంటి అవాంచనీయ ఘటనలు మళ్లీ …
Read More »