జాతీయం

 ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..? ఈపీఎఫ్ వడ్డీ రేటు కొనసాగింపు

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు కేంద్రం ఈపీఎఫ్ఓ ద్వారా పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పొదుపుపై ఇచ్చే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఫిబ్రవరి 28న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్ఓ ​​2024-25 సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల …

Read More »

హైదరాబాద్‌లోని టాప్‌ 5 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇవే.. మొత్తం కోర్సు ఖర్చు ఎంతంటే?

2024 ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ రెండవ స్థానంలో, ఐఐటీ బాంబే మూడవ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆరు ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలు NIRF 2024 ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. అవేంటో.. ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయో.. ఎంతెంత ఖర్చు అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్స్‌ను 2024వ సంవత్సరానికి వరుసగా తొమ్మిదవ సారి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలను …

Read More »

భారత వైమానిక దళంలో బ్రహ్మాస్త్రం.. F-35 ఫైటర్ జెట్స్‌తో మరింత బలోపేతం!

గగనతలం నుంచి సాగించే యుద్ధాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు శత్రువుకు అత్యధిక నష్టాన్ని కలగజేయడం కోసం F-35 యుద్ధ విమానాలను రూపొందించారు. సింగిల్-సీట్, సింగిల్-ఇంజిన్‌తో కూడిన ఈ ఫైటర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగల్గిన మల్టీరోల్ యుద్ధ విమానం.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి చర్చనీయాంశంగా మార్చింది ఒకే ఒక్క అంశం. అది ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ F-35 లైటెనింగ్-II రకం యుద్ధ విమానాలను భారత్‌కు …

Read More »

తలపతి విజయ్‌కి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం!

గతేడాది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్.. ఇటీవలె జనంలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. తమిళనాడులో ఈ కేటగిరీ భద్రత కేవలం ఆయనకు మాత్రమే కల్పించడం విశేషం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..తమిళ స్టార్‌ నటుడు, ఇటీవలె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పిస్తూ ఆదేశలు జారీ చేసింది. విజయ్‌కి వై కేటగిరీ సెక్యురిటీని కేటాయించింది. ఈ వై కేటగిరీ …

Read More »

మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో పెంచుకోండి!

ప్రతి ఒక్కరికి క్రెడిట్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్‌ లేకుంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చాలా కష్టం. ఏదైనా రుణం తీసుకోవాలన్నా క్రెడిట్‌ స్కోర్‌ను చూస్తాయి బ్యాంకులు. అయితే స్కోర్‌ తగ్గితే దానిని పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్‌ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మీకు మంచి స్కోర్ ఉంటే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. మీకు అత్యవసరంగా పర్సనల్ లోన్ అవసరమైతే క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద …

Read More »

యూపీఎస్సీ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ 2025 నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ భర్తీ చేసే ఈ పోస్టులకు పోటీ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యేటా వేలాది మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు …

Read More »

ఉదయాన్నే ఈ ఆకులను నమిలితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?

తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాలనుగుణంగా వ్యాధులను నయం చేయడానికి తులసిని మించింది. తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, …

Read More »

కేవలం 2 గంటల్లోనే హైదరాబాద్‌ టూ బెంగళూరు! దూసుకొస్తున్న హైస్పీడ్‌ రైలు

హైదారబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై మధ్య ప్రయాణించేందుకు రెండు గంటలే అంటే షాక్ అయ్యారా? విమానంలో అయి ఉంటుందిలే అనుకుంటున్నారా? అలా ఏం కాదు.. ట్రైన్ లోనే కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నైకి ప్రయాణించే రోజులు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు రెండు కూడా ఐటీ సిటీలే. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తరచుగా రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా ఉంటోంది. ఈ రెండు మహానగరాల మధ్య రాకపోకలు సాగించేవారు ఎక్కువగా …

Read More »

ఏఐసీసీలో మార్పులు చేర్పులకు కసరత్తు..! ప్రియాంకకు కీలక పదవి..?

వరుస ఓటములతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్కస్థానంలోనూ గెలవలేకపోయింది. ఢిల్లీలో హ్యాట్రిక్ జీరో స్థానాలతో ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో మరికొన్ని మాసాల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు మంచుకొస్తున్నాయి. 2026లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీలో కీలక మార్పులు చేర్పులకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. …

Read More »

విద్యార్ధులకు ఎగిరి గంతేసే వార్త.. ఇకపై సర్టిఫికెట్లు పోయినా పర్లేదు.. ఈ ఒక్కటి ఉంటే చాలు

దేశవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ‘అపార్‌ ఐడీ’ అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఇప్పటికే అన్ని వర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలను ఆదేశాలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ‘అపార్‌ ఐడీ’ అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఇప్పటికే అన్ని వర్సిటీలు, …

Read More »