భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత ఆన్లైన్ చెల్లింపులు బాగా పెరిగాయి. ముఖ్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపులు బాగా పెరిగాయి. యూపీఐ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు పద్ధతుల్లో ఒకటిగా మారింది. యూపీఐ ద్వారా కొనుగోలుదారుల బ్యాంకు ఖాతాల నుంచి వ్యాపారులు, వ్యక్తులకు రియల్టైమ్ చెల్లింపులను అనుమతిస్తుంది.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యూపీఐ చెల్లింపుల సాధారణ పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.1,00,000గా నిర్ణయించింది . అయితే అన్ని బ్యాంకులు వినియోగదారులను …
Read More »ముంబై దాడుల సూత్రధారి.. గ్లోబల్ టెర్రరిస్ట్.. అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి!
ముంబై దాడుల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ సయీద్కు బావ, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్. మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్లో మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మక్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్లో మరణించాడు. మక్కీ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి డిప్యూటీ చీఫ్గా కొనసాగుతున్నాడు. హఫీజ్ మహ్మద్ సయీద్కు హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ దగ్గర బంధువు. …
Read More »ఎయిర్పోర్ట్లో కంగారుగా ఇద్దరు పాసింజర్స్.. వారి లగేజ్ చెక్ చేయగా
ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఫోర్స్ చాలా అలెర్ట్గా ఉంటుంది. ఎవరైనా అనుమానం కలిగినా వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారు. అలానే కష్టమ్స్ కూడా డ్రగ్స్, బంగారం వంటివి అక్రమ రవాణా కాకుండా కాపు కాస్తుంది. తాజాగా బెంగళూరులోని విమానాశ్రయంలో ఓ ఇద్దరు ప్రయాణీకులు అనుమానాస్పదంగా కనిపించారు.కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల దాదాపు రూ. 80 లక్షల విలువైన 8 కిలోల హైక్వాలిటీ హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బ్యాంకాక్ నుంచి వేర్వేరు విమానాల్లో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ …
Read More »నిజాయితీ, నిరాడంబర, సరళతకు ప్రతిబింబం.. మన్మోహన్ సింగ్ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకుంటున్న ప్రముఖులు ఘనంగా నివాళ్లులర్పిస్తున్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణల పట్ల అంకితభావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థికవేత్తగా భారత ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో సేవలందించారని మోదీ గుర్తు చేసుకున్నారు.దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, …
Read More »ఏంటీ..! బాబోయ్.. ఆముదంతో ఇన్ని ప్రయోజనాలా ఉన్నాయా..?
ఆముదం అంటే ఈ జనరేషన్ వాళ్లు ముఖాలు అదోలా పెడతారు కానీ… దీన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీ ఇళ్లలో ముసలివాళ్లను అడిగితే దీని బెనిఫిట్స్ ఏంటో చెబుతారని అంటున్నారు. ముఖంపై ముడతలు, చర్మం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలకు ఆముదంతో చెక్ పెట్టవచ్చట..ఆముదాన్ని సంప్రదాయ వైద్య విధానంలో విరివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. చర్మ సంబంధిత సమస్యలు, జుత్తు సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వంటి …
Read More »కొరడాతో దెబ్బలు కొట్టుకున్న అన్నామలై..
తమిళనాడులో మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శపథం చేశారు. DMKను పదవి నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని ప్రకటించారు. DMK ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ తనకు తాను కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. అన్నా యూనివర్శిటీ క్యాంపస్లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు నిరసనగా ఆయన ఆందోళన చేపట్టారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి….తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరు కొరడా దెబ్బలు …
Read More »ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. వాటిని కరెక్ట్గా వాడకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని సరిగ్గా వినియోగించకపోయినా, రెగ్యులర్గా చెక్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో సాంబయ్య ఇంట్లో ఫ్రిజ్ పేలి ఇంటిలో సామాన్లన్నీ కాలిపోయాయి. ఫ్రిజ్ కంప్రెషర్ పెరగడం వల్ల ప్రేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు.నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. అయితే వాటిని సరిగ్గా వినియోగించకపోయినా, రెగ్యులర్గా చెక్ …
Read More »తమిళనాడులో విద్యార్థినిపై లైంగిక దాడి యత్నం.. రాజకీయంగా రచ్చ రేపుతోన్న తాజా ఘటన..
మహిళలపై జరిగే లైంగిక దాడి ఘటనలు ఒక్కోసారి ప్రభుత్వాలను ఇరకాటంలో పడేస్తుంటాయి. తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఇలాంటి ఘటనతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అందరూ చూస్తుండగానే ఓ కామాంధుడు విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించడం ఘటనలో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడం పట్ల విపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన ఇప్పుడు రాజకీయంగా రచ్చ రేపుతోంది. నగరంలోని తామరై ప్రాంతాల్లో ఉన్న అన్నా యూనివర్సిటీలో ఓ యువతి మెకానికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీలోని …
Read More »రజినీకాంత్ను కలిసిన చెస్ ఛాంపియన్ గుకేశ్.. ఆ పుస్తకం బహుమతిగా ఇచ్చిన సూపర్ స్టార్..
సూపర్ స్టార్ రజినీకాంత్ భారత యువ గ్రాండ్ మాస్టర్.. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేశ్ను సన్మానించారు. తన ఆహ్వానం మేరకు తల్లిదండ్రులతో కలిసి తన ఇంటికి వచ్చిన గుకేశ్ను అభినందించారు తలైవా. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు గుకేశ్.సింగపూర్లో జరిగిన ఫిడే వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు గుకేశ్. 14వ గేమ్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి భారత యువ చెస్ ప్రాడిజీ గుకేశ్ గతవారం చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న …
Read More »మలేరియా రహిత భారతదేశం వైపు వేగంగా అడుగులు.. 97% తగ్గిన కేసులు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్లకు పైగా ప్రజలు మలేరియాతో మరణిస్తున్నారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మూడింట రెండు వంతుల మరణాలు సంభవిస్తున్నాయి. మలేరియా నియంత్రణలో భారతదేశం అపూర్వమైన విజయం సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నారు. ఈ ఏడాది విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1947తో పోల్చితే 97శాతం మేరకు మలేరియా కేసులు తగ్గాయి.మలేరియా రహిత భారతదేశం వైపు ప్రయాణంలో అద్భుతమైన పురోగతికి ఇది నిదర్శనం. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, మలేరియా అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య …
Read More »