భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేయడం ప్రారంభించాయి. పర్యావరణ హితం పట్ల అవగాహన పెగుతుండటంతో EVల రికార్డు అమ్మకాలు పెరగుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్, లేదా ఎలక్ట్రిక్ కార్ లేదా త్రీవీలర్ లేదా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు, ప్రజలు బ్యాటరీతో నడిచే వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్ 2027 నాటికి 35-40 శాతం CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా. 2025 నాటికి భారతదేశంలో EV విక్రయాల వాల్యూమ్లు 3-4 మిలియన్ …
Read More »నిరుద్యోగులకు అలర్ట్.. సీఏపీఎఫ్ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి
కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో బుధవారం వెల్లడించారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్, ఏఆర్ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి వాటివల్ల ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. అక్టోబర్ 30 నాటికి …
Read More »సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తే ఇక ఉక్కుపాదమే.. 28,000 URLలను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో 28000 పైగా URLలను రికార్డు స్థాయిలో బ్లాక్ చేసింది. 2024లో జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులన్నింటిని కేంద్రం బ్లాక్ చేసింది. ఈ URLలలో ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగాలు, మోసం, జాతీయ భద్రత, ప్రజా శాంతిభద్రతలకు ముప్పుగా భావించే అంశాలు ఉన్నాయని పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ యూఆర్ఎల్ లను బ్లాక్ చేయడం జరిగింది.. ఇది దేశానికి హానికరంగా …
Read More »ప్రతి రైలు టికెట్పై 46 శాతం రాయితీ.. పార్లమెంట్లో రైల్వే మంత్రి కీలక విషయాలు!
దేశంలోనే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్కు సంబంధించి ప్రభుత్వం అతిపెద్ద రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రైల్వే మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ను భారత్లో అప్గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం.. భారత రైల్వే ద్వారా ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, అన్ని రకాల రైలు టికెట్లపై రాయితీలు కల్పిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మంత్రి లోక్ సభలో పలు కీలక విషయాలను వెల్లడించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతి …
Read More »హైదరాబాద్కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. దేశంలోనే తొలి సెంటర్గా..
తెలంగాణ ప్రభుత్వం మరో విజయం సాధించింది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) స్థాపనకు అంగీకరించింది. ఇది భారత్లో తొలి సెంటర్గా, ఏషియా పసిఫిక్లో రెండవదిగా, ప్రపంచవ్యాప్తంగా ఐదవదిగా గుర్తింపు పొందనుంది. గూగుల్ LLC, తెలంగాణ ప్రభుత్వం మధ్య బుధవారం ఈ కీలక ఒప్పందం కుదిరింది. GSEC సెంటర్ హైదరాబాద్ను గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్గా తీర్చిదిద్దనుంది. గూగుల్ సెంటర్ సైబర్ భద్రత, ఆన్లైన్ సేఫ్టీ ఉత్పత్తుల రూపకల్పనపై ఫోకస్ చేయనుంది . అధునాతన పరిశోధనలతో పాటు …
Read More »గూగుల్ మ్యాప్ను గుడ్డిగా ఫాలో అయిన డ్రైవర్.. కాలవలో పడిన కారు.. తప్పిన ప్రాణాపాయం
కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్లి ప్రమాదానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూపీలోని బరేలీ-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై గూగుల్ మ్యాప్స్తో చూపించిన విధంగా వెళ్ళిన వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.దారి తెలియకపోతే ఏమిటి.. గూగుల్ మ్యాప్ ఉండగా చింత ఎందుకు దండగ అని అనుకుంటున్నారా.. గూగుల్ మ్యాప్ పై భరోసాతో వాహనంలో ప్రయనిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త. గుడ్డిగా గూగుల్ ని నమ్మి గూగుల్ మ్యాప్స్ మార్గనిర్దేశం చేసిన …
Read More »భారతదేశంలోనే అతిపెద్ద నోటు.. 32 ఏళ్లుగా చెలామణిలో..
Indian Currency Notes: ప్రస్తుతం భారతదేశంలో రూ.500 నోటు అతిపెద్ద నోటు. అయితే దేశంలో రూ.10,000 నోటు చెలామణిలో ఉన్న సమయం ఉంది. అది కూడా స్వాతంత్య్రానికి ముందు. 1938 సంవత్సరంలో రూ.10,000 నోటును విడుదల చేశారు. ఈ నోటు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నోటు. అందుకే ఈ నోటు చలామణిలోకి వచ్చినప్పటి నుండి మూసివేసే వరకు దాని ప్రయాణం గురించి తెలుసుకుందాం. నోటు ఎందుకు తెచ్చారు? స్వాతంత్య్రానికి ముందే ఇంత పెద్ద నోటును చలామణిలోకి తీసుకురావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇంత పెద్ద …
Read More »ప్రెగ్నెన్సీ టైమ్లో పొట్టపై దురద ఇబ్బంది పెడుతుందా? ఇలా చేస్తే చిటికెలో మాయం
తల్లి అవడం ప్రతి అమ్మాయికి ఓ అద్భుతమైన అనుభవం. ఆ సమయంలో పుట్టబోయే తన బిడ్డను తల్చుకుంటూ ఎంతో మురిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. దీంతో కంగారుపడిపోతుంటారు కాబోయే అమ్మలు. ముఖ్యంగా రోజులు గడిచేకొద్దీ పెరుగుతున్న పొట్టచుట్టూ విపరీతమైన దురద వేధిస్తుంది.. దీని నుంచి ఉపశమనం పొందాలంటే.. ప్రెగ్నెన్సీ టైమ్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొంత మందికి అవగాహన లేకపోవడం వల్ల మరింత టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి …
Read More »జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్.. కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇక మరింత బాదుడు..!
మీరు స్మోకరా.. టొబాకో ఉత్పత్తులేమైనా వాడతారా? పోనీ.. కార్లు, కాస్ట్లీ డ్రస్లు, కాస్మొటిక్స్ ఇష్టపడతారా? అయితే ఈ న్యూస్ మీకోసమే! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ విషయంలో మరో ముందుడుగు వేసింది. కొత్తగా మరో శ్లాబ్ను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.. జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్ను తెచ్చే యోచనలో ఉంది కేంద్రం. సిన్ ప్రొడక్ట్స్ పేరుతో ఒక కేటగిరీని తయారుచేస్తుంది. ఈ ప్రొడక్ట్స్పై కొత్తగా 35% జీఎస్టీ విధించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా జరిగిన జీఎస్టీ- గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ …
Read More »రెప్పపాటులో మాయమవుతున్న సొమ్ము.. సైబర్ నేరాల నియంత్రణకు చెక్ పెట్టేదీ వాళ్లేనా..!
భారతదేశంలో ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ ఆరేబియా తరహాలో నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలంటున్నారు సైబర్ నిపుణులు.టెక్నాలజీ పెరిగే కొద్దీ, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ కలిగిస్తోంది. అయితే ఈ తరహా నేరాల నిరోధంలో బ్యాంకులు …
Read More »