టెక్నాలజీ

గన్స్‌తో యుద్ధాలు గెలవలేం..! ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్‌లోని వడోదరలో జరిగిన గతిశక్తి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించారు. ఆధునిక యుద్ధం లో లాజిస్టిక్స్‌ నిర్వహణ ఎంతో కీలకమని, తుపాకులు, బుల్లెట్ల కంటే లాజిస్టిక్స్‌ సామర్థ్యం యుద్ధ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఆధునిక యుద్ధాలను “తుపాకులు, బుల్లెట్లతో గెలవలేం” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం వివిధ సంస్థల లాజిస్టిక్స్ నిర్వహణ ఆపరేషన్ సిందూర్ విజయానికి నిర్ణయాత్మక అంశం అని అన్నారు. గుజరాత్‌లోని వడోదరలో గతి శక్తి విశ్వవిద్యాలయ 3వ స్నాతకోత్సవంలో …

Read More »

ITR 2025: మీరు ఐటీఆర్‌ దాఖలు చేసే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు!

మీరు పన్ను చెల్లింపుదారులైతే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాలనుకుంటే మీ ఆదాయానికి ఐదు ప్రధాన వనరులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వనరులు జీతం, ఆస్తి నుండి అద్దె ఆదాయం, బంగారం, షేర్లు లేదా రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే లాభం, వ్యాపారం నుండి వచ్చే లాభాలు, స్థిర డిపాజిట్లపై వడ్డీ (FDలు) వంటి ఇతర వనరులు. ప్రతి పన్ను చెల్లింపుదారుడి ఆదాయం వీటి నుంచి వస్తుంటుంది. ఉదాహరణకు ఒక …

Read More »

డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన 14 మందిని పోలీసులు ఏం చేశారంటే..?

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు అంగీకరించిన 14 మంది శిక్షకు బదులుగా చికిత్సను ఎంచుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. తెలంగాణ పోలీసుల EAGLE టీమ్.. తెలిపిన ప్రకారం.. వీరంతా గవర్నమెంట్ గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్సకు ముందుకు వచ్చారు. వారు కావాలనుకున్నది శిక్ష రద్దు కాదు, తమ తప్పును ఒప్పుకుని జీవితాన్ని మార్చుకునే అవకాశం అని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసిన వారి కోసం… NDPS చట్టంలోని 64-A సెక్షన్‌ ఒక మార్గం చూపుతోంది. వ్యసనానికి లోనైనవారు …

Read More »

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్.. ఈసారి ఆ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ కావడం ఖాయం..

హైదరాబాద్ మహానగరం మరింత సొబగులు అద్దుకొనుంది. చారిత్రక నేపథ్యంతో కూడిన మీరాలం చెరువుపై ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగరానికి ఆకర్షణగా నిలిచి.. పర్యాటకానికి ఓ కొత్త దిక్సూచి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మీరాలం చెరువును కేంద్రంగా చేసుకుని మరో అద్భుతమైన వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.430 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ వంతెన నిర్మాణ బాధ్యతను మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్)కు అప్పగిస్తూ …

Read More »

హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ రవాణా రంగ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తుది లొకేషన్ సర్వే పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, రాష్ట్ర రాజధానిని చుట్టూ కొత్త రైల్వే మార్గం ఏర్పడనుండగా, ఇది దేశంలోనే వినూత్న ప్రయత్నంగా నిలవనుంది. ఔటర్ రింగ్ రైలు మార్గం ప్రధానంగా సికింద్రాబాద్‌ను అనుసంధానించే ఆరు రైలు కారిడార్లతో కలిపి రూపొందించనున్నారు. వాటిలో సికింద్రాబాద్–కాజీపేట, వాడి, డోన్, ముర్కడ్, గుంటూరు, కొత్తపల్లి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలతో అనుసంధానం వల్ల రైల్వే రాకపోకలపై …

Read More »

కాచిగూడ టూ జోధ్‌పూర్‌ డైరెక్ట్‌ రైలు..! కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో రేపటి నుంచే షురూ..

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థన మేరకు, హైదరాబాద్, జోధ్‌పూర్ మధ్య నేరుగా రైలు సర్వీసును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదించారు. జూలై 19న కాచిగూడ నుండి ప్రారంభమయ్యే ఈ రైలు, హైదరాబాద్‌లోని రాజస్థానీ ప్రజలకు, విద్యార్థులు, వ్యాపార ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్, జోధ్‌పూర్ మధ్య రోజు వారీ డైరెక్ట్‌ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి కిష్గన్ రెడ్డి చేసిన అభ్యర్థనకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఇది …

Read More »

టెన్త్, ఇంటర్‌ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు!

రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 904 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే (SWR).. హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ …

Read More »

వ్యవసాయ రంగంలోనూ ఏఐ అద్భుతాలు.. ఇకపై డ్రోన్స్‌, రోబోలతో సిరుల సేద్యం..!

ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేసే రైతులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గిపోతున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతులు తప్ప కొత్తగా ఎవరూ కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రైతు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రైతు కనుమరుగైతే భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉండబోతుంది. వ్యవసాయ రంగంలో కూడా సమూల మార్పులు రానున్నాయా తెలుసుకుందాం పదండి. సాఫ్ట్ వేర్ రంగంలో అత్యాధునిక మార్పులు వస్తున్నట్లే వ్యవసాయ రంగం కూడా కొత్త …

Read More »

కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. ఏం చర్చించారంటే?

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో వరుగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఉన్న అవకాశాలను సీఎం కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా …

Read More »

హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై మంత్రి కీలక ప్రకటన!

హైదరాబాద్ నగర వాహనదారులకు శుభవార్త. నగరంలోని ప్రముఖ ఎలివేటెడ్ కారిడార్‌లలో ఒకటైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు మంత్రి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి కారిడార్ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని.. అయితే ఈ ఏడాది దసరా నాటికి కారిడార్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యానికి …

Read More »