నీలం సంజీవరెడ్డి , పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి ,వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు వ్యక్తికి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎజెండా, జెండా లేకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో …
Read More »బీ అలెర్ట్.. హైదరాబాద్లో పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా.. కీలక సూచన పోలీసులు
హైదరాబాద్ ప్రజలకు బీ అలెర్ట్.. మీ పిల్లలు జాగ్రత్త. నగరంలో చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తూ టెన్షన్ పుట్టించిన ఓ ముఠా చివరకు పోలీసుల చేతికి చిక్కింది. పిల్లలను ఎత్తుకుపోయి వారిని విక్రయించేందుకు యత్నించిన ఈ ముఠాలో నలుగురిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మాదాపూర్ డీసీపీ వినీత్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఇంట్లో పెద్దలు లేని సమయాల్లో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని, రెక్కీ చేసి చిన్నారులను అపహరిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ …
Read More »అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం.. ఏంటి 8 నెలల్లో ఇంత మంది అరెస్టా?
తెలంగాణలో అవినీతిని అరికట్టడంలో ఏసీబీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఎనిమిది నెలల్లోనే ఏసీబీ మొత్తం 179 కేసులు నమోదు చేసి, ప్రభుత్వ లంచగొండ్లపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటి వరకు లంచం తీసుకున్న 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. అందులోనూ 108 మందిని స్వయంగా లంచం తీసుకుంటున్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం విశేషం. ఈ ఆపరేషన్లలో ఏసీబీ అధికారులు 33.12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా లంచాలు తీసుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాధించిన వారికి కూడా …
Read More »అలా చేయకపోతే వారికి రేషన్ కట్ చేస్తామని అధికారుల హెచ్చరిక…!
తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి రేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ఈ-కేవైసీ పూర్తి చేసిన లబ్ధిదారులకే రేషన్ అందుబాటులో ఉంటుంది. బయోమెట్రిక్ ధృవీకరణ చేయని రేషన్ కార్డులు తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉన్నందున, లబ్ధిదారులు తమ సమీప రేషన్ షాప్ వద్ద వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రేషన్ పంపిణీ ప్రక్రియను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. దర్యాప్తుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నట్టు సీఎం రేవంత్ అన్నారు. ఆ వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై తొమ్మిదిన్నర గంటల సుదీర్ఘ చర్చ సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం కేసును …
Read More »తెలంగాణలో విద్యార్థులకు పండగ.. 13 రోజులు దసరా సెలవులు
తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా 13 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఆగస్ట్ నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. ఇది పండగ సీజన్. విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ నెలలో చాలా రోజుల పాటు సెలవులు ఉండగా, సెప్టెంబర్లో కూడా భారీగా విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. హిందువులకు …
Read More »ఆర్టీసీ డ్రైవర్లకు బిగ్షాక్.. టీజీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏమిటంటే!
రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల భద్రత పెట్టింది పేరు. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆర్టీసీ బస్సుల రోడ్డు ప్రమాదాలపై యాజమాన్యం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కొన్ని సార్లు బస్సు డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల …
Read More »యాదగిరిగుట్టకు అంతర్జాతీయ గుర్తింపు.. స్వామివారి సేవలను ప్రశంసించిన కెనడా ప్రధాని!
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను ఇప్పటికే ప్రపంచ నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు ప్రసంశించారు. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానంకు ఆయన లేఖ రాశారు. తెలంగాణ తిరుపతిగా పేరున్న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు నానాటికి పోటెత్తుతున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో యాదగిరిగుట్ట దేవస్థానం …
Read More »బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాలపై వరుణుడి తాండవం
వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే.? పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అనగా మంగళవారం నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ …
Read More »సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్.. సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాకుండా.. రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని …
Read More »