తెలంగాణ

 ప్రాజెక్టులకు జలకళ… కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండు కుండను తలపిపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా నది, గోదావరి నది కింద ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండడంతో 11 గేట్లు ఎత్తివేత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ తుంగభ్రదకు ఇన్‌ ఫ్లో 42వేల 290 క్యూసెక్కులు కాగా.. …

Read More »

గురుకుల విద్యార్ధులకు భలే ఛాన్స్.. నారాయణ విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్‌ ఉచిత కోచింగ్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, నీట్‌లో అతి కొద్దిమార్కుల తేడాతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్‌ లాంగ్‌ టర్మ్‌ ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో ఇప్పటికే మంత్రి నారాయణ చర్చించారు కూడా. ఇందులో భాగంగా ఈ ఏడాదికి మొత్తం 80 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ …

Read More »

సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే… క్లారిటీ ఇచ్చిన హైడ్రా

చెరువును ఆక్రమించి కట్టిన కాలేజీ భవనాలను కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టం చేసింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడంలో వెనకా ముందు ఆలోచించాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువులను రక్షించడానికి.. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి హైడ్రాను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ఆక్రమణదారుల పనిపడుతోంది ప్రభుత్వం. హైడ్రా …

Read More »

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం… గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్ష

ఇవాళ తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీల్లో 327 నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి.. ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్‌గా ఫోకస్‌ పెట్టనుంది కేబినెట్‌. ఆలస్యమైన నిర్ణయానికి బాధ్యులెవరు? అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది.. అసలు కార్యాచరణ మొదలుపెట్టారా లేదా.. ఇలా అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మంత్రి దగ్గర నుంచి …

Read More »

చర్యలా… చర్చలా..? రెబల్స్‌కి రంగు పడుద్దా?… ఇవాళ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ కీలక భేటీ

ఇవాళ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశానికి ప్లాన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. భేటీలో ఏం జరుగబోతుంది… ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..? బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా? అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా? లేక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇలాగే వర్థిల్లాలి అంటూ లైట్ తీసుకుంటుందా? ఇలా అనేక క్వశ్చన్‌మార్కులతో ఉత్కంఠ రేపుతోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిట్టింగ్. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాన్చకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన …

Read More »

ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు

మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఇటీవలే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందారు. అయితే ఆయన కోలుకుని డిశ్చార్జి కావడంతో అంతా సంతోషించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. డాక్టర్ల సూచనతో కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. షుగర్, సోడియం లెవల్స్‌లో తేడాలు ఉండడంతో …

Read More »

 బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో రంగంలోకి ఈడీ… మొత్తం 29 మంది సెలబ్రెటీలపై కేసు నమోదు

ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ల బండారం బట్టబయలు కాబోతోంది. బెట్టింగ్ యాప్‌ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్‌రాజ్‌, అనన్య నాగళ్ల సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది ఈడీ. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ప్రముఖుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లగించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు …

Read More »

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో కొందరి మృతదేహాలు లభ్యం కాగా మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కోసం ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు గాలింపు చేపట్టిన అధికారులు తాజాగా ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా.. గల్లంతైన వారు కనిపించకపోవడంతో ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమేనని తేల్చి …

Read More »

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురికావడంతో అధికారులు యాక్షన్‌లోకి దిగారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు కల్లు కాంపౌండ్లు సీజ్‌ చేశారు ఎక్సైజ్ పోలీసులు. కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు పరారీలో ఉన్నారు. కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 15 …

Read More »

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు.. ఈసారి కన్వీనర్‌ కోటా సీట్లు ఎన్ని ఉన్నాయంటే?

రాష్ట్ర వ్యప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ గడువును జులై 9 వరకు పొడిగించినట్లు జేఎన్టీయూ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి. బాలునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. జులై 7న మొత్తం 900 విద్యార్థులకు గాను 806 మంది కౌన్సెలింగ్ హాజరయ్యారు. కాగా ఈసారి మొత్తం 171 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో.. 1.14 లక్షలకుపైగా బీటెక్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో కన్వీనర్‌ …

Read More »