తెలంగాణ

చెరువుల్లో 386 ఎకరాలు మాయం!

హైదరాబాద్‌ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన పదేళ్లకాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా.. ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది. మొత్తంగా ఆయా చెరువులన్నింట్లో కలిపి గత పదేళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా కూల్చివేతలు నిలుపుదల..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే వందల ఇండ్లను నేలమట్టం చేశారు. కొందరు పేదల ఇండ్లతో పాటుగా బడాబాబుల ఖరీదైన విల్లాలను సైతం బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అమీన్‌పూర్, పటేల్‌గూడ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం …

Read More »

పోలీస్ స్టేషన్‌కు ఏడో నిజాం మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా.. అసలు వివాదం ఏంటంటే..?

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ మనవరాలు ప్రిన్సెస్‌ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారుసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కొట్టేసేందుకు కుట్రపన్నారంటూ నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండో కుమారుడు హైనస్‌ వాల్షన్‌ ప్రిన్స్‌ మౌజ్జమ్‌ ఝా బహదూర్‌ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం …

Read More »

తెలంగాణ ప్రజలకు సర్కార్ దసరా కానుక.. పండుగకు ఒక రోజు ముందే.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంవైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపికబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యా అందించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ పైలెట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిరలో క్యాంపస్‌లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం …

Read More »

బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు.. ‘తెలంగాణ హెరిటేజ్ వీక్‌’ పేరుతో సంబురాలు

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సూచిక.. తెలంగాణకు మాత్రమే సొంతమైన పూల కేళిక.. బతుకమ్మ పండుగ. పూలను పూజించే అత్యంత అరుదైన సంబురం బతుకమ్మ. ప్రకృతిలోనే పరమాత్మున్ని చూసుకుని.. పూలనే గౌరమ్మగా భావించి.. చేసుకునే తొమ్మిదిరోజుల మహా ఉత్సవం బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు.. బతుకమ్మ పండుగకు అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు.. బతుకమ్మ సంబరాల వారాన్ని.. బతుకమ్మ …

Read More »

సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖపై పరువు నష్టం దావా.. కేటీఆర్ సంచలన నిర్ణయం

KTR on Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు రసవత్తవరంగా మారాయి. హైడ్రా కూల్చివేతలతో పాటు ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. ఈ గొడలన్నింటి మధ్య రైతుల రుణమాఫీ అంశం మరుగున పడిపోతుండటంతో.. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపడుతోంది. ఇటు మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉండటంతో పాటుగానే.. అటు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఈరోజు (అక్టోబర్ 05న) రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నా …

Read More »

నాగార్జున హీరో కాదు విలన్.. ఆ ఒక్క కారణంతోనే మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు: తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చిత్ర సీమలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీద విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే.. ఈ …

Read More »

మంత్రి కొండా సురేఖ వివాదం.. కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదు

ప్రస్తుతం తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చుట్టే రాజకీయం నడుస్తోంది. అయితే.. ఇటీవల మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదైంది. గురువారం (అక్టోబర్ 03న) రోజు హైదరాబాద్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు.. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ …

Read More »

ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు:కొండా సురేఖ

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం (అక్టోబర్ 2) చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆమె అక్కినేని నాగార్జున కుటుంబం, హీరోయిన్ సమంత పేరు తెరపైకి తీసుకొచ్చారు. వారి వ్యకిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న సురేఖ.. మరో మహిళపై ఇటువంటి కామెంట్స్ …

Read More »

సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. మండిపడ్డ ఎన్టీఆర్, నాని, అమల, అఖిల్

మంత్రి కొండా సురేఖ తనను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారని తెగ బాధపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ గురించి చెప్పాలనే ఉద్దేశంలో.. సమంత, అక్కినేని ఫ్యామిలీల మీద బుదర జల్లింది. సమంత, అక్కినేని ఫ్యామిలీను కేటీఆర్ వాడుకున్నాడని, బెదిరించాడని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేసింది కొండా సురేఖ. దీంతో అక్కినేని ఫ్యామిలీ, సమంత తీవ్రస్థాయిలో మండపడింది. ఓ మంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముందు ఇలా బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరిస్తారని మండి పడ్డారు. కొండా …

Read More »