మెదక్ జిల్లాలో ఓ కొడుకు అస్తిపాస్తులు పంచుకుని తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కీలక ఆదేశాలు ఇచ్చారు.తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగులు చూసుకునేందుకు ప్రస్తుత కాలంలో ఇష్టపడట్లేదు. ఆస్తిపాస్తులు, బంగారం, డబ్బులు తీసుకుని తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. వాళ్లను పట్టించుకోకుండా వేరే ఇంట్లో ఉంచుతున్నారు. వేరే దిక్కు లేక, చివరి రోజుల్లో అతికష్టం మీద బతుకు ఈడ్చుకుంటూ వాళ్ళు కూడా అలాగే వృద్ధాశ్రమంలో …
Read More »మేము తలుచుకుంటే వారి పేర్లు, విగ్రహాలు ఉండేవా? రాహుల్కు కేటీఆర్ ఘాటు లేఖ..
చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని ఆయన విమర్శించారుతెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కరి మీద మరొక్కరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదం ముగియక ముందే మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై …
Read More »విద్యార్థులకు ఉపాధ్యాయుడు బైబిల్ పంపిణీ..కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది
విద్యా బోధనలు నేర్పించే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మత ప్రచారం చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్ను పంపిణీ చేశాడు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఉపాధ్యాయుడితో ఆందోళనకు దిగారు.ప్రభుత్వ పాఠశాల మత ప్రచారం కేంద్రంగా మారింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మత బోధకుడిగా మారిపోయాడు. ఏకంగా విద్యార్థులకు బైబిల్ పంపిణి చేశాడు. ఈ విషయం పేరెంట్స్కి తెలియడంతో ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రాజన్న …
Read More »ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. మంత్రి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్లైన్ విధింంచిన మంత్రి.. పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, సామాజిక సర్వే తదితర అంశాలపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. ఈకార్యక్రమంలో సీఎం సలహాదారు, సీఎస్ …
Read More »షార్ట్ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆరుగురు అదృష్టవంతులు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అన్నీ కుదిరితే సంక్రాంతికి తెలంగాణ కేబినెట్లో కొత్త అమాత్యులు చేరబోతున్నారు. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని చర్చ జరుగుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులతోనే రేవంత్ సర్కార్ నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి కేబినెట్లో అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ …
Read More »మంచు విష్ణులో కనిపించని పశ్చాత్తాపం.. దాడి ఘటన పై మీడియకు ఉచిత సలహా..
మంచు కుటుంబంలో వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఆరోపణలు చేశారు. ఇప్పటికే మీడియాపై దాడి ఘటనపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాపై దాడి ఘటనను ఇంకా సెన్సేషన్ చేయెద్దని.. క్షణికావేశంలో జరిగిన దాడి అని అన్నారు.మోహన్ బాబు హెల్త్ అప్డేట్ విడుదల చేసిన తర్వాత మంచు విష్ణు తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్రమంలోనే మీడియాపై దాడి ఘటనను ఇంకా సెన్సేషన్ చెయ్యొద్దని క్షణికావేశంలో మాత్రమే ఆ ఘటన జరిగిందని …
Read More »మోహన్ బాబు కక్ష పెట్టుకుని కొట్టినట్లు ఉంది: టీవీ9 రజినీకాంత్
టీవీ9 జర్నలిస్ట్పై మోహన్బాబు దాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయ్. జర్నలిస్టులతో పాటు అయ్యప్ప భక్తులు, ప్రజలు.. టీవీ9కి మద్దతుగా నిలబడుతున్నారు. మోహన్బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు జర్నలిస్టులు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్పై దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు టీవీ9 ఉద్యోగులు. ఈ నిరసనలో పాల్గొన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.. మోహన్ బాబు ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More »పాపం..తాకట్టుపెట్టిన బంగారం చీప్గా వస్తోందని వేలంలో కొన్నాడు.. కట్ చేస్తే..
ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. ఓ వ్యక్తి లక్షలు పెట్టి బంగారం కొన్నాడు. ఆ తర్వాత బంగారం కట్ చేస్తే వెండి బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకులను కేంద్రంగా చేసుకొని నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కాజేసిన కేటుగాళ్ల బాగోతం ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మణుగూరులో …
Read More »5 నెలల వ్యాలిడిటీ, 320GB డేటాతో బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్!
ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది కస్టమర్లు తమ నంబర్లను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNLకి పోర్ట్ చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందజేయడమే దీనికి కారణం. ఈ సిరీస్లో బీఎస్ఎన్ఎల్ 5 నెలల చెల్లుబాటుతో కొత్త, చాలా చౌక రీఛార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా చౌకగా ఉంటుంది. ఈ ప్లాన్ని యాక్టివేట్ చేయడానికి కస్టమర్ రూ.997 …
Read More »టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు పైశాచిక దాడి.. నిరసనకు జర్నలిస్ట్ సంఘాల పిలుపు
న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మోహన్బాబును వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ జర్నలిస్టులు కోరుతున్నారు. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీవీ9 జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ.. బుధవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శాంతియుత నిరసనకు జర్నలిస్టులు పిలుపునిచ్చారు. టీవీ9 ప్రతినిధి రంజిత్పై దాడిని ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ …
Read More »