మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్.. ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికీ పరిచయాలు ఏర్పడింది బీబీపేట్ లోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు తేలేవరకు వెళ్లింది. గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరి డెడ్ బాడీలు బయటకు రావడం, వీరి శరీరాలపై బలమైన గాయాలు ఉండటం.. చెరువు గట్టుపై వీరి వస్తువులన్నీ ఉండటం.. అసలింతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనే డైలమాలో పడేశాయి..ఒకే సమయంలో.. ఒకేచోట.. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఒక …
Read More »అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన …
Read More »ఇకపై డిగ్రీ థర్డ్ ఇయర్లో లాంగ్వేజ్ సబ్జెక్టులుండవ్.. అన్నీ కోర్ సబ్జెక్టులే
తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్కు స్వస్థి చెప్పేందుకు సిద్ధమైంది. థర్డ్ ఇయర్లో కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇందుకోసం డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్ను పూర్తిగా తొలగించింది. దీంతో ఇకపై డిగ్రీ ఫస్ట్, సెకండియర్లోనే ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది కూడా. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి ఇదేమీ కొత్త విధానం కాదు. …
Read More »గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్క్లియర్.. ఆ ఏడు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీఎస్పీఎస్సీ)ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే పిటిషన్ల దాఖలు ఆలస్యం కావడాన్ని తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన జీవో 29 అప్లోడ్ కాలేదన్న కారణాన్ని తోసిపుచ్చింది. ప్రిలిమ్స్ …
Read More »మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం.. శోకసంద్రంలో తెలుగువారు
మన్మోహన్ సింగ్ మృతితో తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగాయి. మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం చేశారు. ప్రతిష్టాత్మక పనికి ఆహార పథకాన్ని అనంతపురం వేదికగా ప్రారంభించారు. మరోవైపు మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.మన్మోహన్ సింగ్కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించారు. అనంతపురంలో …
Read More »ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
దేశ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నో కీలక పదవుల్లో విశిష్టమైన సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ …
Read More »యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్ ఎవరంటే…!
నకిలీ నోట్ల చలామణి విషయాన్ని కొందరు వ్యాపారులు రాచకొండ చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపూర్ ప్రాంతాల్లో వ్యాపారులు సంత జరిగిన ప్రాంతాల్లో సిసి ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి నకిలీ కేటుగాళ్ళను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి సూచించారు.యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపాయి. నకిలీ నోట్లు ముద్రించి కొందరు దుండగులు చెలామణి చేస్తున్నారు. సాధారణ కరెన్సీ నోట్లను పోలిన …
Read More »చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు.. కలెక్టర్కు ఫిర్యాదు.. కారణం ఏంటంటే..!
గురుకులాల్లో సమస్యలు విద్యార్థులను అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆహార కల్తీ తో ఆస్పత్రి పాలైన విద్యార్థులు… ఇప్పుడు ఉపాధ్యాయులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ రోడ్డెక్కారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ జిల్లా కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జోగుళాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన సంచలనంగా మారింది. తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ …
Read More »అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రాకు ఇంకా వర్షాలు వీడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది.నిన్నటి నైరుతి & ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఈ రోజు బలహీనపడినది. ఆయితే దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 …
Read More »యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటు సాధ్యమేనా..? అసలు చిక్కుముడి అదేనా?
మహిమాన్విత స్వయంభూ లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన చోటు యాదగిరిగుట్ట. అంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో.. 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మగలమా? కారణాలేమైనా నేటికీ అలాగే కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా.. అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. అయితే, యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి …
Read More »