తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నామన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డిలతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాఘవులు సెక్రటేరియట్కు వెళ్లగా.. అక్కడే ఉన్న సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి వారిని రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ సీపీఎం నేతలకు వివరించారు. ఇటీవలె రూ. 2 లక్షల …
Read More »ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు, వివరాలివే..
హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్వహణ పనుల కారణంగా ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన ట్రైన్ల వివరాలను వెల్లడించారు. వరంగల్- హైదరాబాద్ మెమూ, కాజీపేట- బల్లార్ష, సికింద్రాబాద్- వరంగల్ ట్రైన్లు సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 30 వరకు మెుత్తం …
Read More »అర్హులైనా రుణమాఫీ కాలేదా..? గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల పంట రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జులై 18న తొలి విడతలో రూ. లక్షలోపు, జులై 31న రెండో విడతలో రూ. లక్షన్నర లోపు.. ఆగస్టు 31న మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే చాలా మంది రైతులకు అర్హులైనప్పటికీ రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ …
Read More »జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం.. ఆ చిన్నారికి ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్, నర్సుకు కూడా..!
రాఖీ పౌర్ణమి రోజున గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ చిన్నారి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. …
Read More »వర్షాల వేళ స్కూళ్లకు సెలవులు.. కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో వారం రోజుల పాటు కూడా ఇలాగే కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా వచ్చే నాలుగైదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్టులను ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …
Read More »నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వానపడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అబ్దుల్లాపూర్మేట్, జీడిమెట్ల, సూరారం, అబిడ్స్, నాంపల్లి, నాగోల్, అంబర్ పేట్, సుచిత్ర, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్ పేట, షేక్ పేట, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ …
Read More »ఆకతాయి వేధింపులు.. తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క, ఎంత విషాదం
అన్నాచెళ్లలు, అక్కాతమ్ముళ్లు ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఏడాదికి ఒక్కసారి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. అలాంటి పండగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆకతాయి వేధింపులకు ఓ బలైపోయింది. చివరిసారిగా తన తమ్ముడికి రాఖీ కట్టి తనువు చాలించింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలోని ఓ తండాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ తండా కు చెందిన మైనర్ బాలిక …
Read More »సోదర బంధానికి రక్ష! రక్ష!
శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. నేడు రాఖీ పౌర్ణమి శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. ఎంతో మహిమాన్వితమైన ఈ నెలలో… పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. హయగ్రీవుడిగా శ్రీమహావిష్ణువు అవతరించినది శ్రావణ పౌర్ణమి నాడే. …
Read More »రూ.2 లక్షల రుణమాపీ కాలేదా..? నో టెన్షన్ అంటున్న మంత్రి తుమ్మల
తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రైతు రుణమాఫీ చూట్టూనే తిరుగుతున్నాయి. అర్హులందరికీ రుణమాఫీ చేశామని.. కాంగ్రెస్ చెబుతుంటే రైతు రుణమాఫీ డొల్ల అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళన కు గురి చేస్తున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల …
Read More »ఆర్జీవీ నాకు మంచి ఫ్రెండ్.. ప్రభాస్ అసలు క్యారెక్టర్ అదే.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు.. ప్రభాస్ ఉన్న గుణం కూడా అదే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆ సమాజిక వర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసలు కురిపించారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరంటూ కొనియాడారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ …
Read More »