Investment: పెట్టుబడి పెట్టే విషయంలో గత కొంత కాలంగా ప్రజల ఆలోచన ధోరణి మారింది. రిస్క్ ఉన్నా సరే హైరిటర్న్స్ పొందాలని భావిస్తున్న వారు పెరుగుతున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులవైపు మళ్లుతున్నారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండడం, హైరిటర్న్స్ వస్తున్న క్రమంలో ఈక్విటీ ఫండ్స్లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్లోకి వేల కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి. దాదాపు 43 మ్యూచువల్ ఫండ్స్ గత ఆగస్టు నెలలో ఏకంగా రూ.67.98 లక్షల కోట్ల పెట్టుబడులను అందుకున్నాయి. …
Read More »ఎఫ్డీ చేసే వారికి బెస్ట్ ఆప్షన్.. ఈ బ్యాంకుల్లో 9 శాతం వడ్డీ.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?
FD Rates: స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits). ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేని రాబడిని అందించే మదుపు మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో డిపాజిట్లను పెంచుకునేందుకు బ్యాంకులు సైతం మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా 60 ఏళ్ల వయసు లోపు ఉండే జనరల్ కస్టమర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తూ.. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు …
Read More »3 ఏళ్లకే లక్షకు రూ.7 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు 3 షేర్లకు 1 షేరు ఫ్రీ..
టెక్స్ టైల్ సెక్టార్ కంపెనీ అక్షిత కాటన్ లిమిటెడ్ ( Axita Cotton Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బోనస్ షేర్ల జారీ ప్రకటన చేసింది. ఈ బోనస్ షేర్లు జారీకి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించిది. అలాగే గతంలో నిర్ణయించిన రికార్డు తేదీ సెప్టెంబర్ 16ను సెప్టెంబర్ 20 కి మార్చినట్లు పేర్కొంది. అలాగే ఈ కంపెనీ షేరు గత మూడేళ్లో 561 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ …
Read More »ఆ 185 మంది దగ్గరే రూ. 100 లక్షల కోట్లు.. ఈ డేటా చూస్తే మైండ్ బ్లాంక్.. టాప్-10 లో ఒకే మహిళ!
Ambani Adani Wealth: ప్రపంచ దేశాల్లో.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి రేటు ఇతర చాలా దేశాలతో పోలిస్తే ఘనంగా ఉందని చెప్పొచ్చు. ఇదే సమయంలో.. భారత్లో సంపన్నుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో నికర సంపద ఒక బిలియన్ డాలర్లకు (రూ. 8400 కోట్లు) పైగా సంపద ఉన్న వారి సంఖ్య 185 ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ మొత్తం 185 మంది నికర సంపద ఒక ట్రిలియన్ డాలర్ …
Read More »టాటా స్టీల్లో ఆ కంపెనీ విలీనం.. సెప్టెంబర్ 1 నుంచే అమలు.. స్టాక్ కొత్త టార్గెట్ ప్రైస్ ఇదే!
టాటా గ్రూప్లోని మెటల్ దిగ్గజ సంస్థ టాటా స్టీల్ (TATA Steel) స్టాక్ ఫోకస్లోకి వచ్చింది. అయితే ఈ స్టాక్ గత ఆగస్టు నెలలో ఇన్వెస్టర్లను నిరాశపరిచిందని చెప్పవచ్చు. 3 శాతం మేర క్షీణించింది. అయితే కంపెనీ సెప్టెంబర్ 1, 2024 రోజున చేసిన ఓ ప్రకటనతో ఫోకస్లోకి వచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు టాటా స్టీల్ స్టాక్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. …
Read More »అంబానీనా మజాకా.. గూగుల్, యాపిల్కు గట్టి షాక్ ఇచ్చిన జియో.. దెబ్బకు దిగిరానున్న ధరలు!
Cloud Storage Pricing: ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీట్) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100 GB వరకు క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించనున్నట్లు.. ఇది వెల్కం ఆఫర్ కింద వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ విభాగంలో ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి గూగుల్, యాపిల్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని పేర్కొన్నారు విశ్లేషకులు. జియో ఎంట్రీతో.. ఇక క్లౌడ్ స్టోరేజీ …
Read More »అంబానీ రిలయన్స్ కంపెనీ కీలక ప్రకటన.. 100 షేర్లకు మరో 100 షేర్లు ఫ్రీ.. దూసుకెళ్లిన స్టాక్!
భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భారత అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ దీనికి యజమాని. ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా ఇలా ఎన్నో రంగాల్లో తన కార్యకలాపాల్ని విస్తరించి అగ్రపంథాన కొనసాగుతున్నారు. 100 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తి ఈయనకు ఉంది. ఇక గురువారం రోజు రిలయన్స్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం వేళ కీలక ప్రకటనలు వచ్చాయి. సమావేశానికి ముందుగానే.. బోనస్ షేర్ల జారీ గురించి సమాచారం అందింది. ఈసారి 1:1 …
Read More »ఆ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారా.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్.. కారణం ఇదే..
Stock Market News: చిన్న, మధ్య తరహా కంపెనీల (SME IPO) ఐపీఓల్లో, షేర్లలో పెట్టుబడులకు సంబంధించి.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మదుపరులకు వార్నింగ్ ఇచ్చింది. వీటిల్లో పెట్టుబడుల విషయంలో అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది. సదరు కంపెనీలు.. తమ కార్యకలాపాలపై అవాస్తవాల్ని ప్రచారం చేసి.. షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచే ప్రయత్నం చేసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఇటీవలి కాలంలో.. స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయిన తర్వాత.. కొన్ని …
Read More »ఇన్వెస్టర్ల పంట పండింది.. ఒక్కరోజే ఏకంగా 40 శాతం పెరిగిన షేరు.. ఆ ఒక్క కారణంతోనే!
Multibagger Stocks: మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారా. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కాస్త రిస్క్తో కూడుకున్నదని చెబుతుంటారు. అదే సమయంలో మంచి అవగాహనతో.. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్లో బంపర్ ప్రాఫిట్స్ అందుకోవచ్చని నిపుణులు అంటుంటారు. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇందుకోసం ముఖ్యంగా మార్కెట్లపై అవగాహన పెంచుకోవడం దగ్గర్నుంచి.. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రకటనలు ఇలా అన్నింటినీ గమనిస్తూ సరైన టైంలో పెట్టుబడి …
Read More »ఐటీ కంపెనీ కీలక ప్రకటన.. హైదరాబాద్ హైటెక్సిటీలో కొత్త ఆఫీస్ ప్రారంభం.. నియామకాలు షురూ!
Hyderabad New IT Office: తెలంగాణలోని హైదరాబాద్లో ప్రపంచ స్థాయి కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ సహా దిగ్గజ టెక్, ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థలు కూడా హైదరాబాద్లో కొలువై ఉన్నాయి. దేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఇలా చాలా కంపెనీలే ఉన్నాయి. ఇక ఐటీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, గచ్చిబౌలి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐటీ …
Read More »