ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన …
Read More »‘ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో నిరుద్యోగ రేటు చాలా తక్కువ’.. కేంద్ర మంత్రి వెల్లడి
దేశంలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్సభకు తెలియజేశారు. 2023-24లో భారతదేశంలో యువత నిరుద్యోగిత రేటు 10.2 శాతంగా ఉందని, ఈ రేటు ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువగా ఉంది పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 25న లోక్సభలో మంత్రి శోభా కరంద్లాజే రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి, నిరుద్యోగ గణాంకాల వివరాలు వెల్లడిస్తూ.. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) మన దేశంలో ఉపాధి, నిరుద్యోగ యువతకు …
Read More »NEET PG 2024 Counselling: పీజీ మెడికల్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోఎండీ, ఎంఎస్ పీజీ మెడికల్ నాన్ సర్వీస్ కేటగిరీ సీట్లకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తైంది. మొత్తం 1722 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్లో భర్తీ అయ్యాయని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా మెడికల్ కాలేజీల్లో డిసెంబరు 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా చేరాల్సి ఉంటుందని పేర్కొంది. ఫస్ట్ ఇయర్ పీజీ మెడికల్ తరగతులు డిసెంబరు 20వ …
Read More »ఏపీలో నార్మలైజేషన్ లేకుండా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?
రాష్ట్రంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. భారీగా ఉపాధ్యాయ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. అయితే రాత పరీక్ష ఆన్ లైన్ లో ఉంటుంది కాబట్టి పలు విడతలుగా నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కొందరికి ప్రశ్నాపత్రం కఠినంగా, కొందరికి సులువుగాత వస్తుండటంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. పైగా నార్మలైజేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు.. దీనికి స్వస్తి చెప్పేందుకు..ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యం అవుతుందని …
Read More »చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్
కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్ సెల్లార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ …
Read More »ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని APCRDAలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA)… ఒప్పంద ప్రాతిపదికన కింది రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
హనుమకొండ ప్రగతినగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఎస్జీటీ టీచర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.. నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పాఠశాలలో ఎస్జీటీ గెస్ట్ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు …
Read More »TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?
ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం 100 రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్కు శంకుస్థాపన చేస్తామని.. నారా లోకేష్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే వేగంగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు …
Read More »స్వర్ణాంద్ర ప్రాజెక్ట్లో ఉద్యోగాలు.. విజయవాడ ఏపీలో పనిచేయాలి.. నెలకు రూ.75 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం
APSDPS Job Notification 2024 : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి …
Read More »ఒకేసారి 3 శుభవార్తలు చెప్పిన ప్రముఖ టెక్ సంస్థ.. అంచనాల్ని మించి లాభాలు.. ఉద్యోగులకు పండగే!
L and T Technology Services: ప్రముఖ ఇంజినీరింగ్ సేవల సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ ఫలితాల్ని ప్రకటించింది. అక్టోబర్ 16న ఫలితాల్ని వెల్లడించగా.. నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.3 శాతం మేర పెరిగి రూ. 319.60 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఈ సమయంలో లాభం రూ. 315.4 కోట్లుగా ఉండేది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రెండో త్రైమాసికంలో …
Read More »