Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. టీపీసీసీ చీఫ్‌గా కేటీఆర్, కేసీఆర్‌కు ఏఐసీసీ, కవితకు రాజ్యసభ ఎంపీ

Bandi Sanjay: కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల్లో.. ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం అవుతుందని మొదట కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అంటూ రెండు పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్‌కు ఏఐసీసీకి పంపిస్తారని.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కేటీఆర్‌ను నియమిస్తారని.. ఇక కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సీటు ఖాయం చేస్తారని బండి సంజయ్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రె పార్టీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌లది అని పేర్కొన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని తీహార్ జైలులో కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్‌కు.. బీజేపీకి ఏం సంబంధం ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తే కవితకు బెయిల్‌ వస్తుందనడం మూర్ఖత్వమని బండి సంజయ్ మండిపడ్డారు. కవిత బెయిల్‌ విషయంలో బీజేపీపై కాంగ్రెస్‌ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్‌లను.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అరెస్ట్‌ చేయట్లేదని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ప్రశ్నించారు.

మరోవైపు.. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని.. అవన్నీ ఊహాజనితమని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విష ప్రచారంలో భాగమని మండిపడ్డారు. బీజేపీలో అలాంటి చర్చనే ప్రస్తావనకు రాలేదని.. అది జరగదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఇక తెలంగాణలో రైతులకు రుణమాఫీ పూర్తిగా జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటన మొత్తం బోగస్‌ అని తెలిపారు. రాష్ట్రంలో రుణమాఫీ రూ. 72 వేల కోట్లు ఉండగా.. విధివిధానాల పేరుతో దాన్ని రూ.34 వేల కోట్లకు కుదించారని ఆరోపించారు. హైడ్రా పేరుతో జరుగుతోన్న హైడ్రామాను ఆపాలని.. అక్రమ కట్టడాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. చిత్తశుధ్ది ఉంటే నిర్మాణాలు జరగకుండా చూడాలని హితవు పలికారు.

About amaravatinews

Check Also

చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం.. టెంపుల్ సిటీలో కలకలం

టెంపుల్ సిటీ తిరుపతిలో శునకాలపై వరుస దాడుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కొందరు శునకాలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరు భయపెడుతోంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *