అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రెడియంట్స్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.. క్షతగాత్రులను జార్ఖండ్కు చెందినవారిగా గుర్తించారు.
ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంపై సీఎం అధికారులతో మాట్లాడారు.. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికుల్ని విశాఖపట్నం ఇండస్ ఆస్పత్రిలో ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.. ఆ వెంటనే ఈ ప్రమాదం జరగడం కలకలంరేపింది.
Amaravati News Navyandhra First Digital News Portal