తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ.. అసలు విషయం ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు …

Read More »

బలహీనపడిన అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. అల్పపీడనం బలహీనపడిందని.. దీని ప్రభావతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం తూర్పు తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది.. సముద్రమట్టం నుండి 3.1 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ.. ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి …

Read More »

ఇండియన్‌ టాయిలెట్‌.. వెస్ట్రన్‌ టాయిలెట్‌.. ఏది ఆరోగ్యానికి మంచిది?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఆహారం, ఫిట్‌నెస్, వ్యాయామం వంటి విషయాలపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ ఆరోగ్యంకి సంబంధించి తరచుగా నిర్లక్ష్యం చేసే ముఖ్య అంశం టాయిలెట్ల వాడకం. మన దైనందిన జీవితంలో ఇండియన్‌ లేదా వెస్ట్రన్‌ టాయిలెట్‌లను ఉపయోగిస్తుంటాం. కానీ మంచి ఆరోగ్యానికి ఏ టాయిలెట్ ఎక్కువ అనుకూలంగా ఉంటుందో మనలో చాలా మందికి తెలియదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇండియన్‌ టాయిలెట్ ఉపయోగించడం వల్ల కూర్చునే భంగిమ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే పాశ్చాత్య టాయిలెట్లు వృద్ధులకు మరింత సౌకర్యవంతంగా …

Read More »

రోడ్డుపై నిర్లక్ష్యంగా BMW కారు డ్రైవింగ్‌.. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి!

ఢిల్లీలో కారు- బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్​ దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి ఓ మహిళగా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా విధుల నిర్వహిస్తున్న నవ్‌జోత్ ఆయన భార్య కలిసి ఆదివారం ఓ గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం …

Read More »

కోరుకున్నచోటే ఆధార్ సెంటర్లు! పోస్టాఫీస్ కొత్త ప్లాన్ సూపర్!

హైదరాబాద్ లోని మలక్ పేట, నాంపల్లి వాసులకు గుడ్ న్యూ్స్.. ఇకపై ఆధార్ అప్ డేట్, నమోదు వంటి సేవల కోసం ఎక్కడికి వెళ్లే పని లేదు. పోస్టాఫీస్ స్టాఫ్ మీ స్ట్రీట్ కే వచ్చి ఆధార్ సేవలు అందిస్తారు. అంతేకాదు అప్లై చేసుకున్న చోట సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మరిన్ని వివరాలు మీ కోసం.. దేశవ్యాప్తంగా ఆధార్‌ అప్ డేట్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆధార్ అప్ డేట్ కోసం బ్యాంకుల ముందు , ఆధార్ సెంటర్ల ముందు జనం క్యూలు …

Read More »

నిరుద్యోగులకు భలే న్యూస్..! అంగన్‌వాడీల్లో 15,274 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ త్వరలో

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అంగన్‌వాడీ సిబ్బంది నియామకాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై సర్కార్ దృస్టిసారించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను శిశు సంక్షేమశాఖ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు సంబంధించి.. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీల …

Read More »

భారీ వర్షంతో అతలాకుతలం.. హైడ్రా విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోంది: రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు..

కుండపోత వర్షం హైదరాబాద్‌ని షేక్‌ చేసింది. ఆదివారం రాత్రి ఫ్లాష్‌ఫ్లడ్స్‌.. వల్ల అనేక కాలనీలను ముంచెత్తాయి. ఆసిఫ్‌నగర్‌ మాంగర్‌బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం… స్థానికంగా కలకలం రేపుతోంది. దాంతో, జిల్లా కలెక్టర్‌తోపాటు హైడ్రా కమిషనర్‌ రంగంలోకి దిగారు. మాంగర్‌బస్తీలో తిరుగుతూ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేయాలో యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధంచేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మాంగర్‌బస్తీలోనే కాదు.. చాలాచోట్ల నాలాలు కబ్జాలో ఉన్నాయన్నారు. మాంగర్‌బస్తీలాంటి ఘటనలు జరగకూడదనే …

Read More »

పీఎం కిసాన్‌కు సంబంధించి కేంద్రం కీలక నోటిఫికేషన్‌.. 21వ విడత ఎప్పుడు వస్తుంది?

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 21వ విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ విడత రైతుల బ్యాంకు ఖాతాకు.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల రైతుల కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 21వ విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన …

Read More »

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

రైల్వే జోన్లలో ఆర్‌ఆర్‌బీ (ఎన్‌టీపీసీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (CEN 06/2024) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది… దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో ఆర్‌ఆర్‌బీ (ఎన్‌టీపీసీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (CEN 06/2024) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ …

Read More »

డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ RRB నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 368 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సెప్టెంబర్‌ 15 నుంచి ఆన్‌లైన్ విధానంలో.. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ …

Read More »

ఎండిన రొయ్యలు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే మటన్‌ మానేస్తారు..! ఓసారి ట్రై చేసి చూడండి..

తక్కువ ఖర్చుతో లెక్కలేనన్ని పోషకాలను కలిగి ఉన్న చేపలు వివిధ వ్యాధులకు కూడా ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాదు.. ఎండిన చేపలు, రొయ్యలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. ఇది ముఖ్యంగా తీరప్రాంత చేపలు తినే వారికి మంచి బలాన్ని ఇస్తుంది. ఎండు చేపలలో అధిక ప్రోటీన్ లభిస్తుంది.100 గ్రాముల చేపలో 60–80 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చేపల రకాన్ని బట్టి మారవచ్చు. అందువల్ల పోషకాహార లోపం ఉన్న పిల్లల పెరుగుదల, కండర ద్రవ్యరాశిని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, పెరుగుదలను ప్రేరేపించడం వంటి అనేక …

Read More »

మన మోదీయే బాస్.. భారత ప్రధానిపై ప్రపంచ నాయకుల ప్రశంసలు.. ఎవరేమన్నారంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. గుజరాత్‌లోని మెహ్సానాలో జన్మించిన ప్రధాని మోదీ.. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా.. కనీసం రెండు పూర్తి పదవీకాలాలను పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా.. సరికొత్త చరిత్రను లిఖించారు. అలాగే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) …

Read More »

తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్.. కారణం ఇదే

ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు నిర్వహించింది. చర్చలు సానుకూలంగా జరిగాయని.. బంద్‌ను విరమించాలని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను కోరినట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలపై …

Read More »

‘పార్టీ మారినా, భావజాలం మారలేదు..’ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ హైలెట్స్

తాను పార్టీ మారినా, భావజాలం మాత్రం మారలేదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖాకీ, ఖద్దర్ రెండూ తనకు సమానమని, ఏ వేదికలో ఉన్నా సరైన దిశలోనే ముందుకు సాగుతానని తెలిపారు. బహుజన వర్గాల హక్కుల కోసం పోరాటం తన జీవిత లక్ష్యమని, చివరి శ్వాస వరకు అదే దిశగా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న మాజీ IPS అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ప్రయాణం, తన ఆలోచనలను టీవీ9 తెలుగు మేనేజింగ్ …

Read More »

తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తక్కువ ధరకే కాశి, అయోధ్యలను చుట్టేయండి..

తిరుమల తిరుపతి, శ్రీశైలం, విజయవాడ వంటి పుణ్య క్షేత్రాలను వెళ్లేందుకు.. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి RTC బస్సులు పర్యాటకులకు నిరంతరం అందుబాటులో ఉన్నాయి. దీంతో అప్పటికప్పుడు ఈ క్షేత్రాలకు వెళ్లేందుకు కూడా రెడీ అవుతూ ఉంటారు. అయితే కాశి , అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను చూడాలని ఉన్నా.. ముందుగా రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలి. తర్వాత ఆయా ప్రదేశాల్లో సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు.. దీంతో TGSRTC సరికొత్త ఆలోచనలో ముందు కొచ్చింది. త్వరలో అయోధ్య, వారణాసి …

Read More »