ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ దృవపత్రాల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ దృవీకరణ పత్రాలు సృష్టించి కేంద్ర భద్రత బలగాల్లో ఉద్యోగాలు సాదించేందుకు సహకరించిన ముఠాను రిమాండ్ కు తరలించారు. నకిలీ ధ్రువపత్రాలతో ఏకంగా కేంద్ర భద్రతా బలగాల్లో ఉద్యోగాలు పొందిన 9 మందిపై కేసు నమోదు చేశారు. మూడు నెలల విచారణ అనంతరం ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేయడంతో ఇచ్చోడ మీ సేవ సెంటర్ల స్కాం మరోసారి తెర పైకి …
Read More »దమ్ముంటే నిన్ను నువ్వు కాపాడుకో.. మరోసారి రఘునందన్రావుకు బెదిరింపు కాల్స్!
తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్రావుకు వరుస బెదిరింపుకాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే ఓ ప్రోగ్రాంలో ఉండగా ఎంపీ రఘునందన్రావుకు ఫోన్ చేసిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తనను లేపేస్తామని బెదిరింపులకు పాల్పడగా ఈ విషయాన్ని ఎంపీ రఘునందన్ రాష్ట్ర డీజీపీతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు అదనపు భద్రత అవసరమని గ్రహించిన తెలంగాణ పోలీస్ శాఖ. కేంద్రబలగాలతో కూడిన ఎస్కార్ట్ను రఘునందన్రావుకు కేటాయించింది. ఇదిలా ఉండగా ఆదివారం మరోసారి ఆయనకు బెదిరింపుకాల్ వచ్చింది. …
Read More »అదే మా టార్గెట్.. అప్పట్లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం- సీఎం చంద్రబాబు
ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సపోర్ట్ ఉందని.. ఖచ్చితంగా ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 లోగానే ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం …
Read More »ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 2 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్లే (హైదరాబాద్-కన్యాకుమారి- 07230) ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు నాంపల్లి స్టేషన్ …
Read More »ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకట చేసింది.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురు గాలులతో.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. …
Read More »టెక్నలాజియా..! వాటర్ టిన్లతో గోదావరిలో చేపల వేట.. చూస్తే అదుర్స్ అంటారంతే..
చేపలు పట్టడంలో నూతన టెక్నాలజీ వాడుతున్నారు గోదారోళ్ళు.. వలలు, గేలాలు వేసి చేపలు పట్టడం పాత పద్ధతి.. ప్లాస్టిక్ డబ్బాలతో చేపలు పట్టడం నూతన పద్ధతి.. అంటూ గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సామాన్యంగా మత్స్యకారులు సముద్రాలు, నదులు, కాలువలు, చేపలు వేటాడాలంటే పడవల్లో వెళ్ళి వలలు వేసి చేపలు పడుతుంటారు. లేదంటే ఒడ్డున ఉండి గేలాలు వేసి పడుతుంటారు.. ఇవన్నీ సర్వసాధారణం.. కానీ గోదారోళ్ళు చేపలు పట్టడంలో నూతన ట్రెండ్ అవలంభిస్తున్నారు. చేపలు …
Read More »కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. ఛార్జ్ తీసుకోనున్న రవడ చంద్రశేఖర్
కేరళ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్ను నియమించింది. కేరళలో తలస్సేరి ASPగా తన కెరీర్ను ప్రారంభించిన ఆయన 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు. డీజీపీ పోస్ట్ కోసం ఈయనతో పాటు మరో ఇద్దరు రేసులో ఉండగా కేబినెట్ చంద్రశేఖర్వైపే మొగ్గు చూపింది.ఆంధ్రప్రదేశ్కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్, కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్ (డీజీపీ)గా …
Read More »మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక అప్డేట్ వచ్చేసిందోచ్..
ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. …
Read More »పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఇక డిజిటల్ చెల్లింపులు.. ఎప్పటి నుంచి అంటే..
పోస్టాఫీసును క్రమం తప్పకుండా ఉపయోగించే వారికి ఇది శుభవార్త. పోస్టాఫీసు కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సౌకర్యం ప్రారంభం కానుంది. దీనితో పోస్టాఫీసు కూడా UPI నెట్వర్క్లో చేరింది. కొత్త IT సిస్టమ్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కారణంగా ఇది సాధ్యమైంది. యూపీఐ వ్యవస్థకు అనుసంధానించనందున పోస్టాఫీసులో డిజిటల్ చెల్లింపులు అంగీకరించబడలేదు. ఇప్పుడు, కొత్త సాంకేతికత అమలు చేస్తోంది. పోస్ట్ల శాఖ తన ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేస్తోంది. డైనమిక్ QR కోడ్లతో లావాదేవీలను ప్రారంభించే కొత్త అప్లికేషన్లు ఇందులో ఉంటాయి. ఈ అప్లికేషన్లతో కూడిన …
Read More »ఆపరేషన్ సిందూర్లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారికి కొత్త ‘రా’ చీఫ్గా బాధ్యతలు!
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా ముఖ్యమైన నిఘా సమాచారాన్ని అందించిన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతి పరాగ్ జైన్ను కొత్త RAW చీఫ్గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ IPS అధికారి. చాలా కాలంగా కేబినెట్ సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద నిఘా సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) ప్రస్తుత అధిపతి రవి సిన్హా జూన్ 30న పదవీ విరమణ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, దేశ బాహ్య నిఘా బాధ్యతలను …
Read More »ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి క్యారవ్యాన్ సర్వీస్!
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్లో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన టూరిజం క్యారవాన్ను ప్రారంభించారు.ఆంద్రప్రదేశ్ లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్లో నూతన క్యారవ్యాన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామన్నారు. …
Read More »తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ.. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
ఆరోగ్యశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది.రెండ్రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈమేరకు జూన్ 10 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకనుంది. ప్రభుత్వ హాస్పిటల్స్లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు …
Read More »ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం..! ఎవరిచ్చారంటే..?
జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద జీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి “ధర్మ చక్రవర్తి” బిరుదు ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని ప్రధానమంత్రి మోదీ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “నేను దీనికి తగినవాడిని కాదని నేను భావిస్తున్నాను. కానీ సాధువుల నుండి మనం ఏది స్వీకరించినా దానిని ప్రసాదంగా స్వీకరిస్తాం అనేది మన సంస్కృతి. కాబట్టి, నేను ఈ ప్రసాదాన్ని వినయంగా స్వీకరించి మా భారతికి అంకితం చేస్తున్నాను.” అని …
Read More »మీరు ఏటీఎంకి వెళ్లి ఇలా చేస్తున్నారా.. అయితే బీకేర్ఫుల్!
మీరు ఏటిఎంలో డబ్బులు డ్రా చేయడానికి లేదా.. డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా.. ఆలా ఏటీఎంకి వెళ్లినప్పుడు మీరు ఫోన్లో మాట్లాడుతూ.. పక్కనే ఉన్న వారు డబ్బులు తీసేందుకు హెల్ప్ చేస్తామాంటే ఒకే చెబుతున్నారా.. అయితే బీకేర్పుల్.. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఇలానే మిమ్మల్ని మాటల్లో పెట్టి సాయం చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడవచ్చు. తాజాగా ఇలానే ఓ వ్యక్తికి సహాయం చేస్తున్నట్లు నమ్మించిన బాధితుడి అకౌంట్ నుంచి సుమారు రూ.31 వేలు డ్రాచేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో వెలుగుచూసింది. …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారందరికీ KTR వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal