ఇక సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు.. 2026 నుంచి అమలు

ఏడాదిలో రెండు సార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బుధవారం (జూన్ 25) ఆమోదం తెలిపింది. ఈ విధానం 2026 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అంటే 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు సీబీఎస్సీ పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారన్నమాట. ఈ మేరకు ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడానికి వీలు కల్పించే కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతుందని అధికారులు బుధవారం (జూన్‌ 25) తెలిపారు. కొత్త విధానం ప్రకారం …

Read More »

పీజీసెట్‌లో 93.55 శాతం ఉత్తీర్ణత.. ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి …

Read More »

అక్కడున్నది CBN..! ఇది కదా అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఏపీకి ఇక సొంతంగా

విజన్-2047 దృష్టిలో పెట్టుకుని ఏపీలోని అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియాగా తీర్చిదిద్దుతున్నారు సీఎం చంద్రబాబు. ఆయన విజన్ నుంచి వచ్చినదే ఈ ‘అమరావతి క్వాంటం వ్యాలీ’.. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..అమరావతి క్వాంటం వ్యాలీ – నేషనల్ వర్క్‌షాప్’ కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధవారం ఉదయం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న ప్రసంగిస్తూ, క్వాంటం టెక్నాలజీతో కూడిన భవిష్యత్తు దిశలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయాణాన్ని వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

పాస్ పోర్ట్ ధ్రువీకరణలో దేశంలోనే టాప్‌.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన తెలంగాణ పోలీసులు!

పాస్ పోర్ట్ అప్లికేషన్ వేరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన వెరీ ఫాస్ట్ యాప్‌కు బెస్ట్ సర్వీస్ అవార్డు దక్కింది. మంగళవారం పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రాన్ని ఇంటలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి అందుకున్నారు.తెలంగాణ పోలీసులను వరుస అవార్డులు వరిస్తున్నాయి. ఇటీవలే జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర …

Read More »

రోజులు మారాయి గురూ.. ఆ స్కూల్‌లలో దర్శనమిస్తున్న నో అడ్మిషన్ బోర్డ్స్‌!

ప్రభుత్వ స్కూల్స్‌ అనగానే.. ఏ అక్కడ క్వాలిటీ స్టడీ ఉండదు.. ఎందుకు అక్కడ చేర్చడం అని అనుకునే వారు ఇప్పుడు తమ మైండ్‌ సెట్‌ను మార్చుకోవాల్సిందే అంటున్నారు అధికారులు. ఎందుకంటే ఇప్పుడు ఆరోజులు మారాయి.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ చొరవ, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, పదో తరగతిలో విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ఫలితాలే ఇందుకు నిదర్శనం.ఎటువంటి ఫీజు తీసుకోకుండా విద్య.. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్, మధ్యాహ్న భోజనం వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా.. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లకు పంపేవారు కాదు. …

Read More »

ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరుల వినియోగాన్ని సమర్థంగా మలచేందుకు మరో కీలక అడుగు వేసింది. బనకచర్ల ప్రాజెక్టును స్థాపించేందుకు పునాది వేస్తూ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా “జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్” అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అమరావతిని కేంద్రంగా చేసుకుని పనిచేయనున్న ఈ కంపెనీని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని పట్టుకుని, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు …

Read More »

హైదరాబాదీస్ బీ అటెన్షన్.. టోల్‌తో పన్లేదు.! ఇక ఓఆర్ఆర్‌పై గాల్లో దూసుకెళ్లడమే..

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. ఆ పద్మవ్యూహం నుంచి బయటపడటానికి వాహనదారులు ఓఆర్ఆర్‌పై ప్రయాణం చేస్తుంటారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణం కొంతదూరం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిపైనే ప్రయాణానికి మొగ్గు చూపిస్తుంటారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణం చేస్తున్న వాహనారులకు కూడా ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్ట్ స్టాగ్‌ను సెకన్లలో రీడింగ్ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు. దాంతో ఈ లేన్‌లో వాహనాలు ఆగే పరిస్థితి ఉండదు. బారికేడ్లు తెరిచి ఉండగానే.. …

Read More »

కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి తెలియాలి.. ప్రత్యేక తీర్మానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తీర్మానాన్ని ఆమోదించారు. అంతకుముందు ఎమర్జెన్సీలో అణచివేతకు వ్యతిరేకంగా కేబినెట్‌ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి వివరించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అత్యవసర …

Read More »

ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న ఫార్ములా-E రేస్ కేసులో మరోసారి ఐఏఎస్ అరవిందు కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ పలుమార్లు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని గతంలో రాబట్టారు. ఆయన స్టేట్‌మెంట్లను సైతం ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే కొద్ది రోజులపాటు సెలవు నిమిత్తం అరవింద్ …

Read More »

పోస్టాఫీసులో డబ్బును విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు.. తీరా పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా

పోస్టాఫీసుల్లో డబ్బులు దాచుకున్న ఖాతాదారుల సొమ్మును పక్కదారి పట్టిస్తున్న పోస్ట్‌మాస్టర్ల ఉదంతాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగండ్ల, చెరుకూరు, నాగులపాలెం పోస్టాఫీస్‌ బ్రాంచ్‌లలో ఇటీవల ఇలాంటి మోసాలే వెలుగు చూసాయి. తాజాగా బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీస్‌లో పోస్టుమాస్టర్ నకిలీ పాసు పుస్తకాలతో ఖాతాదారులను మోసం చేసిన విషయం వెలుగు చూసింది.కష్టపడి సంపాదించుకుని పొదుపు చేసుకున్న సొమ్ము ఎవరో అప్పనంగా కొట్టేశారంటే ఎలా ఉంటుంది. చాలీచాలని సంపాదనలో కూడా రూపాయి రూపాయి కూడబెట్టి భవిష్యత్‌ అవసరాలకు …

Read More »

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే యూపీఎస్సీలో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో గ్రూప్-ఏ, బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 462 అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్), అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా), కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్‌ 14వ …

Read More »

హైదరాబాద్‎లోనే జగన్నాథుడి దర్శనం.. పూరి వెళ్ళలేనివారికి బెస్ట్..

పూరి.. చార్‌ధామ్ యాత్రలో ఒకటి. అయితే హైదరాబాద్ వాసులు చాలామంది దూరం, బడ్జెట్ కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికోసం ఆ జగన్నాథుడు భాగ్యనగరంలో కూడా దర్శనం ఇస్తున్నాడు. మరి హైదరాబాద్‎లో పూరి జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది.? ఈ టెంపుల్ చరిత్ర ఏంటి.? హైదరాబాద్‎లోని శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ అద్భుతమైన సృష్టి. ఈ పవిత్ర స్థలం ప్రజల మనస్సులలో హృదయాలలో దైవిక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇది అచ్చం పురిలో ఉన్న టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. పూరి వెళ్లలేము అనుకునేవారికి ఇది మంచి ఎంపికనే చెప్పవచ్చు.  …

Read More »

పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పై అనుచితంగా కామెంట్స్ చేసిన వారిని గుర్తించారు. …

Read More »

పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

కాంగ్రెస్ అంటేనే నిలదీతలు.. నినాదాలు కామన్‌. కానీ మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో ఇవేవీ కనిపించలేదు. అంజన్‌ కుమార్ లాంటి నేతలు పదవులపై ప్రశ్నిస్తే.. జగ్గారెడ్డి లాంటి నేతలు రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కార్యకర్తలను ఖుషీ చేయాలంటూ సూచనలు చేశారు. మరోవైపు ధర్నా బ్యాచ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం హాట్‌గా జరిగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తమ సామాజికవర్గమంతా అసంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణలో యాదవులకు కీలక పదవులు ఇవ్వలేదన్నారాయన. …

Read More »

లెక్క మారింది.. ఆ బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదే.. సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..

నీట ముంచినా.. పాల ముంచినా మంత్రులదే బాధ్యత.! ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క. పరిస్థితిని సీరియస్‌గా తీసుకోకుంటే ఏ పరిణామాలకైనా బాధ్యత వహించాల్సిందే. ఇదీ క్లుప్తంగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్‌. అలాగే గట్టుదాటిన పార్టీ నేతలను కూడా ఇకపై ఉపేక్షించేంది లేదని హెచ్చరికలు జారీ చేశారు.18 నెలల పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..స్థానిక ఎన్నికల రూపంలో త్వరలో అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది. దీంతో పరిపాలన వ్యవస్థను సెట్‌రైట్‌ చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే మూడు …

Read More »