గగనతలం నుంచి సాగించే యుద్ధాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు శత్రువుకు అత్యధిక నష్టాన్ని కలగజేయడం కోసం F-35 యుద్ధ విమానాలను రూపొందించారు. సింగిల్-సీట్, సింగిల్-ఇంజిన్తో కూడిన ఈ ఫైటర్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగల్గిన మల్టీరోల్ యుద్ధ విమానం.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి చర్చనీయాంశంగా మార్చింది ఒకే ఒక్క అంశం. అది ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన లాక్హీడ్ మార్టిన్ F-35 లైటెనింగ్-II రకం యుద్ధ విమానాలను భారత్కు …
Read More »Blog Layout
డా బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. పేదింటి బిడ్డలకు ఛాన్స్
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు బీఆర్ఏజీ సెట్-2025 నోటిఫికేషన్ను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. పేదింటి విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి..ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్).. రాష్ట్రంలోని డా బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు …
Read More »తలపతి విజయ్కి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం!
గతేడాది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్.. ఇటీవలె జనంలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. తమిళనాడులో ఈ కేటగిరీ భద్రత కేవలం ఆయనకు మాత్రమే కల్పించడం విశేషం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..తమిళ స్టార్ నటుడు, ఇటీవలె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పిస్తూ ఆదేశలు జారీ చేసింది. విజయ్కి వై కేటగిరీ సెక్యురిటీని కేటాయించింది. ఈ వై కేటగిరీ …
Read More »మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్తో పెంచుకోండి!
ప్రతి ఒక్కరికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ లేకుంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చాలా కష్టం. ఏదైనా రుణం తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ను చూస్తాయి బ్యాంకులు. అయితే స్కోర్ తగ్గితే దానిని పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మీకు మంచి స్కోర్ ఉంటే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. మీకు అత్యవసరంగా పర్సనల్ లోన్ అవసరమైతే క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేట్లకు పెద్ద …
Read More »వేడుకగా సమతాకుంభ్ 2025.. గద్యత్రయ పారాయణంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు (14-02-2025) శుక్రవారం ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో చినజీయర్స్వామి మార్గనిర్దేశంలో అర్చక స్వాములు, రుత్విక్లు, వేద విద్యార్థులు, భక్తులు కలిసి ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు.రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు (14-02-2025) శుక్రవారం ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో చినజీయర్స్వామి మార్గనిర్దేశంలో అర్చక స్వాములు, రుత్విక్లు, వేద విద్యార్థులు, భక్తులు కలిసి ధ్యాన పద్ధతిని …
Read More »యూపీఎస్సీ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ 2025 నోటిఫికేషన్.. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ భర్తీ చేసే ఈ పోస్టులకు పోటీ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యేటా వేలాది మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు …
Read More »ఉదయాన్నే ఈ ఆకులను నమిలితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?
తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాలనుగుణంగా వ్యాధులను నయం చేయడానికి తులసిని మించింది. తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, …
Read More »భానుడి ప్రతాపం మొదలైంది.. ఏపీలో వచ్చే 3 రోజులు ఇలా..
ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పొద్దున్న వేడి.. రాత్రి చలితో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది.. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ ఏంటి. దిగువ ట్రోపోఆవరణములో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం …
Read More »కేవలం 2 గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు! దూసుకొస్తున్న హైస్పీడ్ రైలు
హైదారబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై మధ్య ప్రయాణించేందుకు రెండు గంటలే అంటే షాక్ అయ్యారా? విమానంలో అయి ఉంటుందిలే అనుకుంటున్నారా? అలా ఏం కాదు.. ట్రైన్ లోనే కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నైకి ప్రయాణించే రోజులు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు రెండు కూడా ఐటీ సిటీలే. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తరచుగా రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా ఉంటోంది. ఈ రెండు మహానగరాల మధ్య రాకపోకలు సాగించేవారు ఎక్కువగా …
Read More »ఏఐసీసీలో మార్పులు చేర్పులకు కసరత్తు..! ప్రియాంకకు కీలక పదవి..?
వరుస ఓటములతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్కస్థానంలోనూ గెలవలేకపోయింది. ఢిల్లీలో హ్యాట్రిక్ జీరో స్థానాలతో ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో మరికొన్ని మాసాల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు మంచుకొస్తున్నాయి. 2026లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీలో కీలక మార్పులు చేర్పులకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal