Blog Layout

ఇకపై ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్ధులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ఠ వయోపరిమితిలోనూ ఐదేళ్ల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. దివ్యాంగులను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్‌ అమలు చేయనుంది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా …

Read More »

బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు!

GBS Case: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. ఓ మహిళకు జీబీఎస్‌ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..దేశంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. తెలంగాణలో తొలి జీబీఎస్‌ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే …

Read More »

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పట్నుంచంటే?

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తారు. సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతీయేట ఈ పరీక్షను …

Read More »

ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త థరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్లు మొరాయిస్తున్నాయి.ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయల దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడటంతో అవి మొరాయిస్తున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త …

Read More »

చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా 161 రకాల సర్వీసులు

ప్రజల వద్దకే పాలన అన్నట్లు… దేశంలోనే ఫస్ట్‌ టైమ్‌ వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్.దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9552300009 నెంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు.. 161 రకాల ప్రజలు సేవలు పొందొచ్చు. టీటీడీ సహా దేవాలయ టికెట్లు, APSRTC, అన్న క్యాంటీన్, …

Read More »

ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..

ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.30 డిపార్ట్ మెంట్ లు,2వేల పడకలు,ఫిజియోథెరపీ ,డెంటల్, కాలేజ్ లు,హాస్టల్ వసతి తో …

Read More »

తెలంగాణ ఇంటర్ బోర్డ్ vs ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. యవ్వారం ఎక్కడిదాకా వెళ్తుందో?

ఇంటర్ బోర్డు వైఖరిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలకు తమ కాలేజీలను సెంటర్లుగా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. దీంతో మరో నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానుండగా.. పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1125 కాలేజీలు బోర్డు నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాయి.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సెంటర్లపై సందిగ్ధత ఏర్పడింది. ఇంటర్ బోర్డు వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు జూనియర్ …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే ధృవపత్రాల జారీ !

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. పౌరసేవల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం(జనవరి 29) సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. …

Read More »

ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?

నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్‌ సివిల్స్‌ అకాడమీ డైరెక్టర్‌ రాజేంద్రకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ …

Read More »

టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం

టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యదగిరి గుట్ట ప‌విత్రత కాపాడేలా చ‌ర్యలు తీసుకోవాలని, భ‌విష్యత్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విధివిధానాల రూప‌క‌ల్పన‌ చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ధర్మకర్తల మండలి (యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు) ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాకు పలు సవరణలను సీఎం ప్రతిపాదించారు..తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల (టీటీడీ) త‌ర‌హాలోనే యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి …

Read More »