చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా విలువైన వస్తువులను దొంగతనం జరగడం గురించి విన్నాం. వీళ్లు మాత్రం వేరే రేంజ్.. చికెన్ షాపులను మాత్రమే టార్గెట్ చేస్తారు.. దర్జాగా ఆటోలో వస్తారు.. చికెన్ షాపు బయట కనిపించే కోళ్లను తస్కరిస్తారు. కోళ్లను మెల్లగా ఆటోలో వేసుకుని జారుకుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కోళ్ల మాయమవుతండటంతో అనుమానం వచ్చిన యాజమానులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు వ్యవహారం బయటపడింది.ఎవరైనా విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలిస్తారు. …
Read More »Blog Layout
అమ్మ బాబోయ్.. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి..! పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది. పాదముద్రల ఆధారంగా పులి కదలికను పసి గడుతున్నారు అటవీశాఖ సిబ్బంది. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. డప్పు దండోరా వేస్తూ కొత్తగూడ, నల్లబెల్లి గ్రామాల ప్రజలను అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది. బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు అంచనా వేసిని అటవీ శాఖ, ఆడ పులి జాడ వెతుక్కుంటూ కొత్తగూడ ఏరియాకు వచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మగపులి కోనాపురం, ఓటాయి, కామారం సమీప అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారుఅటు అదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న పెద్ద …
Read More »రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ఇదిగో క్లారిటీ…
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సర్కార్ సెలవుల్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అనే చర్చ మొదలైంది. దీంతో అకడమిక్ …
Read More »క్లాస్ రూమ్లో ఒంటరిగా విద్యార్థిని.. ఆమె వద్దకు వెళ్లి ప్రొఫెసర్ వికృత చేష్టలు
తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్తో ఉమామహేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఉమామహేష్ను అదుపులోకి తీసుకొని తిరుపతి రూరల్ పీఎస్కు తరలించారు పోలీసులు.టెంపుల్ సిటీలో ఆచార్యుడి వక్రబుద్ధి బయట పడింది. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆచార్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర …
Read More »గోవా నుంచి వికారాబాద్ వచ్చిన ట్రైన్.. ఓ భోగీలో తనిఖీలు చేయగా
కొత్త సంవత్సరం వేడుకలకు సమయం దగ్గరపడుతోంది.. ముందుగానే ఏర్పాట్లు షురూ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గ్రాండ్గా ఈవెంట్స్ నిర్వహణ జరుగనుంది. ఈవెంట్స్, సెలబ్రేషన్స్ సంగతి అలా ఉంటే.. ఇటు పోలీసులు సైతం అలెర్ట్ అయ్యారు. అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచారు.వికారాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గోవా మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ మద్యం తీసుకువచ్చినట్లు గుర్తించార. వాస్కోడిగామా ట్రైన్లో 95 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. హైదరాబాద్కి చెందిన కొందరు యువకులు కొత్త ఏడాది …
Read More »డాక్టర్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాల్సిందే.. అన్ని పార్టీల నుంచి పెరుగుతున్న డిమాండ్!
భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల..పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ను దేశం గుర్తుంచుకుంటుందని కొనియాడుతున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలుగా పాటిస్తోంది.దేశ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించిన మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ …
Read More »పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
హైదరాబాద్లో ఇటీవల సోషల్ మీడియాలో ‘ట్రాఫిక్ చలాన్ల పై భారీ డిస్కౌంట్’ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వార్త ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు వైరల్ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫేక్ వార్తగా తేల్చేసారు. గతంలో ఈ తరహాలో డిస్కౌంట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈసారి వైరల్ …
Read More »2025 సంవత్సరం ప్రభుత్వ సెలవుల వివరాలు క్లియర్గా…
2025కి సంబంధించి హాలిడేస్ లిస్ట్ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. కాగా ఆప్షనల్ సెలవు తీసుకోవడానికి, ఉద్యోగులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. వారి సూపర్వైజర్ నుంచి అనుమతి పొందాలి.మరో 3 రోజుల్లో 2024 సంవత్సరం ముగిసిపోతుంది. 2025లోకి గ్రాండ్గా అడుగుపెట్టేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా 2025లో పండగల సెలవులపై కూడా క్లారిటీ వచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల లిస్ట్ను తెలంగాణ సర్కార్ తాజాగా రిలీజ్ చేసింది. …
Read More »ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో కీలక పరిణామం.. కేటీఆర్కు ఈడీ నోటీసులు..!
గత BRS ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా E కార్ రేస్లో నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ను ఏ1గా చేర్చింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏ2గా, HMDA మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చింది ఏసీబీ.ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు(KTR) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు …
Read More »కలుపు తీస్తోన్న గిరిజనుడిపైకి దూసుకువచ్చి చుట్టేసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత
పొలంలో పనులు చేస్తున్న జన్ని రాము అనే గిరిజనుడిపై కింగ్ కోబ్రా అకస్మాత్తుగా దాడి చేసింది. సుమారు పది అడుగుల పొడవుతో భయానకంగా ఉన్న కింగ్ కోబ్రా పెద్ద పెద్దగా బుసలుకొడుతూ జన్ని రాముపై దాడి చేయడంతో ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురయ్యాడు. పొలం పనిలో నిమగ్నమైన గిరిజనుడికి ఎదురైన ఈ ఘటన స్థానికులను సైతం గగుర్పాటుకు గురి చేసింది.జన్ని రాము ప్రతిరోజు పొలం పనులకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే రాము ఉదయాన్నే జీడి మామిడి తోటకెళ్లి …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal