గోవా నుంచి వికారాబాద్ వచ్చిన ట్రైన్.. ఓ భోగీలో తనిఖీలు చేయగా

కొత్త సంవత్సరం వేడుకలకు సమయం దగ్గరపడుతోంది.. ముందుగానే ఏర్పాట్లు షురూ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గ్రాండ్‌గా ఈవెంట్స్ నిర్వహణ జరుగనుంది. ఈవెంట్స్, సెలబ్రేషన్స్ సంగతి అలా ఉంటే.. ఇటు పోలీసులు సైతం అలెర్ట్ అయ్యారు. అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచారు.

వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గోవా మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ మద్యం తీసుకువచ్చినట్లు గుర్తించార. వాస్కోడిగామా ట్రైన్‌లో 95 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన కొందరు యువకులు కొత్త ఏడాది వేడుకల కోసం గోవా నుంచి పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు తీసుకువెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. వికారాబాద్‌ ఎక్సైజ్,‌ RPF, GRP పోలీసులు వాస్కోడిగామా రైల్లో దాడులు నిర్వహించి 95 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

About Kadam

Check Also

తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఐటీలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *