ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. మార్చి 31న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తొలుత ప్రకటించగా.. సరిగ్గా అదే రోజున …
Read More »Blog Layout
AP 2025 Holidays: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఎన్ని రోజులో తెలుసా?
సాధారణ సెలవుల్లోనూ రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం, ఇతర పండగలు ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే జనవరి, ఏప్రిల్, ఆగస్టు మాసాల్లో మాత్రం నాలుగేసి రోజులు హాలీ డేస్ వచ్చాయి.. 2025 సంవత్సరానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. ఇందులో మొత్తం 23 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన …
Read More »Biggestn Breaking: అల్లు అర్జున్ అరెస్ట్..పోలీస్ స్టేషన్కు తరలింపు..
సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ను కూడా నిందితుడిగా …
Read More »మిత్రమా.. ఇంకా ఒక రోజు మాత్రమే గడువు.. ఆ తర్వాత ఏంటో తెలుసా?
Aadhaar Update: ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డును పుట్టిన తేదీ, బయోమెట్రిక్లు, చిరునామా, ఇతర అప్డేట్లతో సహా నిర్దిష్ట గడువు వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించింది. ఇప్పుడు ఈ గడువు దగ్గరపడింది. మీ ఆధార్ కార్డ్ను ఉచితంగా అప్డేట్ చేయడానికి మీకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. అటే డిసెంబర్ 14 వరకు మాత్రమే గడువు. ఆ తర్వాత అప్డేట్ చేసుకుంటే రూ.50 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు …
Read More »వామ్మో.! గడ్డకట్టించే చలి.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు..
తెలుగు రాష్ట్రాలనూ మంచు ముంచేస్తోంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అటు దట్టమైన మంచుతో వాహనాలు, విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విశాఖ ఎయిర్పోర్ట్లో భారీగా పొగ మంచు కురుస్తోంది. పొగమంచుతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇక మంచు ఎక్కువగా ఉండటంతో విమానాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు …
Read More »చలికాలంలో మీ కళ్లు జర జాగ్రత్త.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి..
చలికాలంలో అనేక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీకు కళ్లలో నొప్పి, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం లేదా తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు లాంటివి కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని కంటి జబ్బుల లక్షణం కావచ్చు. లక్షణాలను సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా, ఏదైనా తీవ్రమైన కంటి వ్యాధిని సులభంగా నివారించవచ్చు. శీతాకాలంలో ఏ కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. వాటిని ఎలా నివారించాలో నిపుణుల నుంచి తెలుసుకుందాం.. …
Read More »విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇబ్బందులు ఉండవు..!
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జీఎంఆర్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్పోర్టులో రెండో టెర్మినల్ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇది ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో ఉపయోగపడనుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రతి ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ సంఖ్య 4.5 కోట్లకు చేరుకున్న తర్వాత కొత్త టెర్మినల్ను జీఎంఆర్ గ్రూప్ పూర్తిగా వినియోగంలోకి తీసుకురానుంది .ఇప్పటికే ఎఐతో పని చేసే ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ను (APOC) కేంద్ర పౌర విమానయాన శాఖ …
Read More »అప్పుడు ఖమ్మం.. ఇప్పుడు లగచర్ల.. రైతుకు బేడీలపై వేడెక్కిన రాజకీయం.. జైలర్ సస్పెండ్..
లగచర్ల రైతుకు సంకేళ్ల ఇష్యూలో రేవంత్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది..బీఆర్ఎస్ పార్టీ. అన్నంపెట్టే రైతు చేతికి బేడీలు వేస్తారా..? అంటూ మండిపడుతోంది. దీంతో హస్తం నేతలు ఏడేళ్లు వెనక్కి వెళ్లి ఖమ్మం ఇష్యూను తెరమీదకు తెస్తున్నారు. ఇంతకూ లగచర్య ఇష్యూకు.. ఖమ్మం ఘటనకు సంబంధం ఏంటి..? లగచర్ల Vs ఖమ్మం ఘటనలో వాస్తవాలేంటి..?చల్లబడిదనుకున్న లగచర్ల ఇష్యూ మరోసారి వేడెక్కింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ తోపాటు అధికారులపై దాడి కేసులో నిందితుడు, రైతు హీర్యా నాయక్ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో …
Read More »‘ప్రార్థనా స్థలాల్లో సర్వే చేపట్టరాదు..’ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశం లోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయాలు , మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ మరికొందరిని భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేయనున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం తర్వాత.. మంత్రి వర్గ విస్తరణపై కీలక అప్డేట్ రానుంది.ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీబిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలుప్రాజెక్టుల కోసం నిధుల మంజూరు చేయాలంటూ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal