కాలంతో పాటు రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతం ఉన్న సాంకేతికతో అధునాతన సౌకర్యాలతో కోచ్లు, సెమీ-హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. కొత్త రైలు మార్గాల నిర్మాణం, విమానాశ్రయాల తరహాలో స్టేషన్ల తీర్చిదిద్దుతోన్న కేంద్ర ప్రభుత్వం.. వందేభారత్, వందే సాధారణ్ లాంటి రైళ్లను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తోన్న ఈ రైళ్లు తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు.. ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేస్తున్నాయి. కాగా, వందేభారత్ కంటే ముందే ప్రారంభమైన ఓ సూపర్ ఫాస్ట్ రైలు కేవలం మూడు స్టేషన్లలో …
Read More »Blog Layout
పీవీ సింధు స్టన్నింగ్ షో.. మూడో ఒలింపిక్ మెడల్ దిశగా విజయం
తెలుగుతేజం పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్పై 21-9, 21-6తో వరుస సెట్లలో గెలిచి.. శుభారంభం చేసింది. తాజాగా బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుబాను సైతం ఓడించింది. తొలి మ్యాచ్కు మించి బుధవారం జరిగిన మ్యాచ్లో పీవీ సింధు సత్తాచాటింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్ను 21-5తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో …
Read More »టాప్-6 మ్యూచువల్ ఫండ్స్.. పదేళ్లలో అదిరిపోయే లాభాలు..
భారత్లో గత కొంత కాలంగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఏటా పెరుగుకుంటూ వెళ్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్వైపు జనం ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ఇంకా ముఖ్యంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) జనాన్ని ఆకర్షిస్తున్నాయి. దీని ద్వారా ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం డబ్బుల్ని కొంత కాలం వరకు ఇన్వెస్ట్ చేస్తుండాలి. అప్పుడు ప్రతి ఏటా మంచి రాబడితో లాంగ్ టర్మ్లో భారీగా లాభాలు అందుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం కూడా సిప్ అనేది …
Read More »ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …
Read More »జీవిత, ప్రమాద బీమాపై జీఎస్టీ ఎత్తేయండి… నిర్మలా సీతారామన్కు గడ్కరీ రిక్వెస్ట్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ …
Read More »జియో భారత్ జే1 4G ఫోన్ కేవలం రూ.1799 మాత్రమే..
Jio Bharat J1 4G Phone : దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (Jio Bharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. ఇది 4G కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్. జియో స్పెషల్ జియో భారత్ ప్లాన్కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ- ఇన్స్లాల్ చేసింది. రేర్ …
Read More »161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు
ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో …
Read More »ఐటీఆర్ గడువు పొడిగింపుపై.. ఐటీ శాఖ కీలక ప్రకటన..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఇవాళ్టితో గడువు పూర్తవుతుంది. తమ అకౌంట్ ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులందరూ జులై 31, 2024లోపు రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. జులై 30వ తేదీ వరకు 6 కోట్లకుపైగా ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులు ఫైల్ చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది తమ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, ఇ-ఫైలింగ్ పోర్టల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం ద్వారా రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నట్లు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ …
Read More »ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది.. …
Read More »కేంద్రం నుంచి ఏపీకి తీపికబురు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తికాగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal