స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు. భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానంగా ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు. ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోకూడదన్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దని సూచనలు చేశారు. ప్రతి ఊరిలో గుడి ఉండాలి. గుడి, బడి లేని ఊరు ఉండకూడదన్నారు …
Read More »Blog Layout
స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్… కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్
హైదరాబాద్లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. రేవ్పార్టీ నిందితులకు రాజకీయంగా సంబంధాలు ఉన్నాయా అనేదానిపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. స్టిక్కర్పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది నకిలీదని నిర్ధారించారు. టోల్ చార్జీ కట్టకుండా తప్పించుకునేందుకే కారుకు ఎంపీ స్టిక్కర్ వేసుకున్నట్టు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. సీజ్ చేసిన కారు అశోక్ నాయుడిదిగా గుర్తించారు. ఆదివారం కొండాపూర్ SV …
Read More »ఏపీ, తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వచ్చే 3 రోజులు నాన్స్టాప్ వర్షాలే వర్షాలు..
ఏపీలో నేడు రేపు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశముంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా వానలు పడతాయి గోదావరి, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది.ఈ ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు …
Read More »నోట్ల హాస్పిటల్.. ఇక్కడ కాలిన, చిరిగిన నోట్లు కూడా తీసుకోబడును..
మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగినా, కాలిపోయినా ఏం చేస్తాం, వాటిని ప్లాస్టర్తో అతికించి చెలామని చేసేలా చూస్తాం. కానీ అక్కడ కూడా చెలామని కాకపోతే ఇక చేసేదేమి లేక పడేయడమో దాచి పెట్టడమో చేస్తుంటాం. మనకు ఎదైనా సమస్య వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో.. నోట్లను సరిచేసేందుకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. కరెన్సీ హాస్పిటల్స్ ఇవెక్కడున్నాయి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్ ఉంది. …
Read More »సింగపూర్లో చంద్రబాబు సభకు కిక్కిరిసిన ఆడిటోరియం… ఐదు దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు..
సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి సభికులను నిర్వాహకులు తరలించారు. తెలుగు ప్రజల …
Read More »చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..
ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా (స్టఫింగ్ లేకుండా), మరొకటి ఆలూ స్టఫ్డ్ బ్రెడ్ పకోడా (లోపల మసాలా బంగాళాదుంపల స్టఫింగ్ తో). మీ సమయాన్ని బట్టి, మీకు నచ్చిన విధంగా ఈ రెండు రకాల పకోడాలను ప్రయత్నించి చూడండి. మీ సాయంత్రపు స్నాక్ టైమ్ను మరింత స్పెషల్ గా మార్చుకోండి! 1. సాధారణ బ్రెడ్ పకోడా (స్టఫ్ చేయనిది) కావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 6 శనగపిండి (Besan) …
Read More »ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? డేంజర్ లో పడినట్లే.. వెంటనే బరువు తగ్గడం ఆపెయ్యాలి..
బరువు తగ్గడం చాలా మందికి జీవితంలో ఒక పెద్ద లక్ష్యమే. కానీ, ఎప్పుడు ఆపాలి, సరైన బరువుకు చేరుకున్నామని ఎలా తెలుసుకోవాలి? మీ శరీరం మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే మీరు మీ సరైన బరువునే మెయింటైన్ చేస్తున్నారని అర్థం. వాటిని తెలుసుకుని ముందుగానే అనవసర కసరత్తులు ఆపేయడం మంచిది.. లేదంటే ఎనర్జీ లాస్ అవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు.. శారీరకంగా ఉత్సాహంగా భావించడం: మీరు శారీరకంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అనిపించడం మీరు మంచి బరువులో …
Read More »చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష..
చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు చెప్పిన అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడిని కఠిన శిక్ష విధించింది. దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పొక్సో వంటి చట్టాలను సైతం కామాంధులు లెక్క చేయడం …
Read More »అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పిచ్చిన వ్యక్తిని పథకం ప్రకారం కత్తులతో పొడిచి చంపించేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన పరుచూరి అశోక్ అనే వ్యక్తిని పథకం ప్రకారం పాణ్యం శివారులోని5 ఓ సోడ షాపు పిలిపించి కత్తులతో పొడిచి చంపిన ఘటనలో పోలీసులు పది …
Read More »బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ – సస్పెన్స్ ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాల కోసం పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఈ దిశగా పంచాయతీరాజ్ చట్టం, 2018కి సవరణలు చేయాలని నిర్ణయించి, తగిన ఆర్డినెన్సు ముసాయిదాను సిద్ధం చేసింది. జులై 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదానికి జులై 15న పంపించారు. అయితే గవర్నర్ జిష్ణదేవ్ పర్మ ఆ ఫైల్ను సమగ్రంగా పరిశీలించి, …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal