ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంతవత్సరానికి ఏప్రిల్ 1వ తేదీన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవగా.. ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే …
Read More »Blog Layout
ఏపీ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న అమరావతి ఫేజ్ 2!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరి ఆ ఎజెండాలో ఉన్న అంశాలేంటి? అమరావతికి సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలేంటి? తెలుసుకుందాం. ఇటు పాలనతో పాటు అటు రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా వేగం పెంచింది కూటమి ప్రభుత్వం. అమరావతి సహా ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. మంగళవారం(ఏప్రిల్ 15) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. …
Read More »పార్క్ హయత్లో అగ్ని ప్రమాదం.. అదే బిల్డింగ్ 5వ ఫ్లోర్లో SRH టీమ్! లేటెస్ట్ అప్డేట్..
పార్క్ హయాత్ హోటల్లోని స్పాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. ఈ సమయంలో హోటల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం మొదటి అంతస్తులో సంభవించగా, ఆటగాళ్ళు ఐదవ అంతస్తులో ఉన్నారు. అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు.పార్క్ హయత్ అగ్ని ప్రమాదం సంభవించింది. అదే హోటల్లో సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు ఉండటం ఆందోళనలు రేకితిస్తోంది. అయితే ఈ ఘటనపై Tv9 తో డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న …
Read More »ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన ఎలా ఉపయోగపడుతోంది?
ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) భారత మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం ద్వారా, ఈ పథకం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. పేదరికాన్ని తగ్గించడంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను పెంచడంలోనూ PMMY కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మహిళలకు ఆర్థిక గౌరవాన్ని అందిస్తుంది.భారత దేశంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. …
Read More »వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం.. అలర్ట్ జారీ చేసింది. ఒక ద్రోణి పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఒక ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ …
Read More »కుమారుడు మార్క్ శంకర్ పేరిట నిత్యాన్నదానానికి రూ. 17 లక్షల విరాళం అందజేసిన పవన్ సతీమణి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి …
Read More »‘ఎస్బీఐ’ ఫెలోషిప్కు దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే రూ.మూడున్నర లక్షల వరకు జీతం
డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుత అవకాశం అందిస్తోంది. ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 పేరిట ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి ఎస్బీఐ ఫౌండేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 13 నెలల వరకు కొనసాగే ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును నడిపించే లక్ష్యంతో ఏర్పాటు చేసింది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచడానికి అవకాశం ఉంటుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది అక్టోబరులోపు ఏదైనా డిగ్రీ …
Read More »లక్షలాదిమంది రైతులకు గుడ్ న్యూస్ అంటోన్న కాంగ్రెస్ సర్కార్
లక్షలాదిమంది రైతులకు గుడ్ న్యూస్ అంటోంది తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. తెలంగాణలో ఏప్రిల్ 14, సోమవారం నుంచి భూ భారతి చట్టం అమల్లోకి రాబోతుంది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలతో పోర్టల్ను మరింత పటిష్టంగా రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్వోఆర్-2020 స్థానంలో ఆర్వోఆర్-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో భూ …
Read More »ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు.. ఉచిత రవాణా సౌకర్యం కూడా!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ప్రీ ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. అంగన్వాడీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించేవారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. దీంతో మూడేళ్లు నిండిన పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తే అటు తల్లిదండ్రులకు ఆర్ధిక …
Read More »రేపటితో ముగుస్తున్న ‘టెన్త్’ జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు ముగిశాక ఏప్రిల్ 7వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అయితే టార్గెట్ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసేందుకు హడావుడిగా పేపర్లు దిద్దుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని …
Read More »