Blog Layout

మహిళలకు అద్దిరిపోయే శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మహిళలు ప్రయాణించవచ్చో.. కూడా చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీనిచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై …

Read More »

ఫిష్ వెంకట్‌కు టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలు పంపాడంటే?

టాలీవుడ్ ప్రముఖ తెలుగు నటుడు, కామెడీ విలన్‌ ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. తనదైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో ప్రస్తుతం …

Read More »

లార్డ్స్ మైదానంలో మూడో టెస్ట్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ.. ఆనందంతో చిందులేస్తున్న ఫ్యాన్స్

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి లండన్‌లో ఉన్నారు. ఇటీవల ఈ స్టార్ జంట వింబూల్డన్ 2025 లో జరిగిన ఒక హై-ప్రొఫైల్ టెన్నిస్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. అక్కడ విరాట్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ కు సపోర్ట్ ఇస్తూ కనిపించాడు. మీడియా నివేదికల ప్రకారం, విరాట్-అనుష్క లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంటున్నారు. వింబూల్డన్ మ్యాచ్‌లు లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్‌లో జరుగుతున్నాయి. ఇది …

Read More »

డ్రైవరన్న జర భద్రం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆ జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం!

ఎక్కువగా రోడ్డుప్రమాదాలు రాత్రి పూటనే జరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం ఒకటి డ్రైవర్స్‌ నిద్రమత్తు, మరొకటి మద్యం సేవించి వాహనాలు నడపడం. చాలా వరకు నిద్రమత్తు కారణంగానే రాత్రి పూట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్టాప్, రీప్రెష్‌ అండ్‌ గో అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అసలేంటి ఈ స్టాప్, రీప్రెష్‌ అండ్‌ గో.. దీన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి. రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో …

Read More »

వానలు వచ్చేశాయ్‌రా బుల్లోడా.. 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ కేంద్రం ప్రకారం.. ద్రోణి ఇప్పుడు ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్‌లోని గంగానది, దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ప్రాంతంతో అనుబంధము ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు. దక్షిణ …

Read More »

చెవులకే కాదు.. మెదడుకూ ప్రమాదమే..! హెడ్‌ ఫోన్స్‌ తో జాగ్రత్త.. మీ అలవాటును మార్చుకోలేదో అంతే సంగతి..!

హెడ్‌ ఫోన్స్ వాడకుండా ఉండటం చాలా మందికి కష్టం. కానీ ఎక్కువ సౌండ్‌ తో పాటలు వినడం లేదా కాల్స్‌ లో మాట్లాడటం కేవలం చెవులకే కాదు.. మెదడు, నరాల వ్యవస్థకు కూడా హానికరం. ఈ అలవాట్ల వల్ల శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ లు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. రోజూ పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా కాల్ మాట్లాడేటప్పుడు హెడ్‌ ఫోన్‌ లు వాడటం అందరిలోనూ మామూలే అయిపోయింది. …

Read More »

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం.. దెబ్బకు ఛూమంత్రం వేసినట్లే..

వంటగదిలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, మసాలా దినుసులు ఉంటాయి.. కానీ వాటిలో అత్యంత ప్రత్యేకమైనది కొత్తిమీర.. నాన్‌ వెజ్ అయినా.. పప్పు అయినా, కూర అయినా, రైతా అయినా, చట్నీ అయినా.. కొత్తిమీర ఆకులు ప్రతి ఆహారం రుచి.. వాసనను పెంచి అద్భుతంగా మారుస్తాయి.. ఈ ఆకులు రుచిని పెంచడమే కాకుండా, మన శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది సాధారణంగా కనిపించే ఒక విషయం కావొచ్చు.. కానీ దానిలో దాగి ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని …

Read More »

అలర్ట్.. బుధవారం స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు బంద్..? కారణం ఏంటంటే..

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.. దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు.. వాటి అనుబంధ సంఘాల ఐక్యవేదిక జూలై 9న (బుధవారం) భారత్ బంద్‌ కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక.. జాతి వ్యతిరేక విధానాలను అనుసరించడం.. హక్కులను కాలరాయడం.. కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. గత 10 ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశాలు నిర్వహించకుండా …

Read More »

 రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే

మూడేళ్ల క్రితం ఏడు లక్షల అప్పు తీసుకున్నారు. వందకు నాలుగు రూపాయల వడ్డీ చొప్పున చెల్లిస్తూ వచ్చారు. కొంతకాలం తర్వాత వడ్డీ కట్టలేకపోయారు. దీంతో వడ్డీ వ్యాపారి జులుం చూపించాడు. వడ్డీ కట్టకుంటే ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధించాడు. కొద్దీ రోజుల తర్వాత ఇంటికి తాళం వేశాడు. వ్యాపారి వేధింపులు తాళలేక బాధితులు గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. పాత గుంటూరుకు చెందిన అంకమ్మ అనే మహిళ తోపుడు బండిపై ఉల్లిపాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గోపి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో …

Read More »

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. 3 రోజులు వీఐపీ దర్శనాలు రద్దు

ఇంద్రకీలాద్రి పై అట్టహాసంగా శాకంభరి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి… మూడు రోజులపాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళతో అలంకరించనున్నారు.. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ మొదటి రోజు కావడంతో కేవలం దాతలు ఇచ్చినటువంటి కూరగాయలు ఆకుకూరలు పళ్ళతోనే అలంకారం చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి అలంకరణకు దాదాపు …

Read More »