ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్లో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన టూరిజం క్యారవాన్ను ప్రారంభించారు.ఆంద్రప్రదేశ్ లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్లో నూతన క్యారవ్యాన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామన్నారు. …
Read More »Blog Layout
తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ.. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
ఆరోగ్యశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది.రెండ్రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈమేరకు జూన్ 10 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకనుంది. ప్రభుత్వ హాస్పిటల్స్లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు …
Read More »ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం..! ఎవరిచ్చారంటే..?
జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద జీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి “ధర్మ చక్రవర్తి” బిరుదు ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని ప్రధానమంత్రి మోదీ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “నేను దీనికి తగినవాడిని కాదని నేను భావిస్తున్నాను. కానీ సాధువుల నుండి మనం ఏది స్వీకరించినా దానిని ప్రసాదంగా స్వీకరిస్తాం అనేది మన సంస్కృతి. కాబట్టి, నేను ఈ ప్రసాదాన్ని వినయంగా స్వీకరించి మా భారతికి అంకితం చేస్తున్నాను.” అని …
Read More »మీరు ఏటీఎంకి వెళ్లి ఇలా చేస్తున్నారా.. అయితే బీకేర్ఫుల్!
మీరు ఏటిఎంలో డబ్బులు డ్రా చేయడానికి లేదా.. డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా.. ఆలా ఏటీఎంకి వెళ్లినప్పుడు మీరు ఫోన్లో మాట్లాడుతూ.. పక్కనే ఉన్న వారు డబ్బులు తీసేందుకు హెల్ప్ చేస్తామాంటే ఒకే చెబుతున్నారా.. అయితే బీకేర్పుల్.. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఇలానే మిమ్మల్ని మాటల్లో పెట్టి సాయం చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడవచ్చు. తాజాగా ఇలానే ఓ వ్యక్తికి సహాయం చేస్తున్నట్లు నమ్మించిన బాధితుడి అకౌంట్ నుంచి సుమారు రూ.31 వేలు డ్రాచేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో వెలుగుచూసింది. …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారందరికీ KTR వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర …
Read More »భాగ్యనగరంలో ఈ సరస్సులు సూపర్.. కచ్చితంగా చూడాలి..
హైదరాబాద్ తెలంగాణ పరిపాలనా కేంద్రం. దీని చారిత్రక కట్టడాలు, ఐటీ సంస్థలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ అందమైన సరస్సులు ప్రశాంతమైన సహజ ప్రకృతి దృశ్యాలు కలిగి ఉంటాయి. ఇవి పిక్నిక్, బోటింగ్ కోసం మంచి ఎంపిక. మరి భాగ్యనగరం చుట్టూ పక్కల ఉన్న 5 ఉత్తమ సరస్సులు ఏంటి.? ఈరోజు తెలుసుకుందామా.. హుస్సేన్ సాగర్ సరస్సు: 1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో హైదరాబాద్ ప్రసిద్ధ సరస్సులలో ఒకటైన హుస్సేన్ సాగర్ నిర్మించబడింది. ఈ సరస్సు 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి …
Read More »బేగంపేట్ ఎయిర్ పోర్ట్ను తరలించండి.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భయాందోళన..
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత.. దేశంలోని ఎయిర్ పోర్టుల సమీపంలో నివాసం ఉండే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగానే ఫ్లైట్స్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తుంటాయి. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ఇక.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత.. ఎయిర్పోర్టుల సమీపంలో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే.. DGCAకి కంటోన్మెంట్ వికాస్ మంచ్ లేఖ రాసింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ తరలించాలని డిమాండ్ చేసింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ను దుండిగల్కు తరలించాలని …
Read More »కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ బాస్.. ఆ నేతల మధ్యనే తీవ్ర పోటీ..! ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు
ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ సాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. అయితే స్టేట్ పార్టీకి కొత్త బాస్ ఎవరు అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పదవి కోసం మేం ప్రయత్నించడం లేదని కొందరు చెబుతుంటే.. అంతా హైకమాండ్ చూసుకుంటుందన్నది ఇంకొందరి వాదన. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మరికొద్ది రోజుల్లోనే సమాధానం రాబోతున్నట్టు తెలుస్తోందితెలంగాణలో ఈసారి అధికారం మాదే. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణలోని బీజేపీ నేతలు పదే పదే చాలా …
Read More »ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్స్టా పోస్ట్
ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లోని ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత 18 ఏళ్లుగా తెలుగు మీడియాలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్లో యాంకర్గా పని చేస్తున్నారు.గత 18 ఏళ్లు తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్గా, జర్నలిస్ట్గా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం …
Read More »కోరిన కోర్కెలు తీర్చే అరసవెల్లి సూర్య దేవాలయం.. చరిత్ర తెలుసా.?
ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది. ప్రతిఏటా రథ సప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్యభగవానుడి దర్శనకి తరలివస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడి ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూలవిరాట్ను తాకుతాయి. ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతన౦. శాసనాలు ప్రకారం 7వ శతాబ్ద౦లో ఈ ఆలయన్ని నిర్మించారు. మన దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడి మూలవిరాట్ను స్వయ౦గా దేవే౦ద్రుడు ప్రతిష్టించారని చెబుతారు. అయితే ‘పద్మపురాణ౦’ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal