amaravatinews
November 5, 2024 క్రైమ్
138
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. రకరకాల పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్గా చేసుకొని చాలా ఈజీగా దోచేస్తున్నారు. సామాన్యుల అత్యాశను పెట్టుబడిగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. మెున్నటి వరకు ఈ కేవైసీ, గిఫ్ట్ కార్డులు, లక్కీ డ్రాలు, డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో చాలా మంది యువత, ఉద్యోగులు ట్రేడింగ్ వైపు మెుగ్గు చూపుతుండటంతో అటుగా వారి ఫోకస్ పడింది. ఆన్లైన్ ట్రేడింగ్ పాఠాలు, చిట్కాలు, పెట్టుబడులు అంటూ చాలా ఈజీగా మోసాలు చేస్తున్నారు. …
Read More »
amaravatinews
November 5, 2024 ఆంధ్రప్రదేశ్, చిత్తూరు
140
చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ వైఎస్సార్సీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. తన ఛైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్కు పంపారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో డాక్టర్ సుధీర్ తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని.. ఆయన వెంట కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా …
Read More »
amaravatinews
November 5, 2024 తెలంగాణ
133
హైదరాబాద్ శివారు హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటు మీద పడటంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హయత్నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం (నవంబర్ 4) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ ముదిరాజ్ కాలనీలో నివాసం ఉండే అలకంటి చందు, సరోజ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అజయ్ (6) హయత్నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం …
Read More »
amaravatinews
November 5, 2024 అంతర్జాతీయం, ఆంధ్రప్రదేశ్
120
తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఖండాంతరాలు దాటి విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్నారు. అక్కడి అమ్మాయి, అబ్బాయిల ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. మన తెలుగు కుర్రాళ్లు.. అక్కడి అమ్మాయిలను ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు యువకుడి ప్రేమ కథ ఖండాంతరాలు దాటింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అబ్బాయి.. కెనడా అమ్మాయిని ప్రేమించి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని …
Read More »
amaravatinews
November 5, 2024 ఆంధ్రప్రదేశ్
260
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో.. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 2029 నాటికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలకు గృహనిర్మాణంపై సమీక్ష చేసిన చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పురోగతిపై వివరించారు. డిసెంబరులో పీఎంఏవై 2.0 పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేలా కేంద్ర …
Read More »
amaravatinews
November 5, 2024 ఆంధ్రప్రదేశ్
153
ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం మెనూ మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక్కటే మెనూ అమలు చేస్తుండగా.. వేర్వేరు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మోనూ సిద్ధం చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై మూడు నుంచి నాలుగు రకాల మెనూలు అమలు చేయాలని భావిస్తున్నారు.. వాస్తవానికి జిల్లాకో మెనూ అమలు చేయాలని అనుకున్నారు.. కానీ కొన్ని జిల్లాల్లో ఒకే విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నందున జోన్కు ఒక మెనూ ఉండాలని నిర్ణయించారు. మంగళగిరిలో డొక్కా సీతమ్మ …
Read More »
amaravatinews
November 5, 2024 ఆంధ్రప్రదేశ్
123
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి సహకార బ్యాంకు (ఆప్కాబ్) ఉద్యోగులు రూ.1.16 కోట్ల విరాళాన్ని అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సహకార శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్బాబు, బ్యాంకు ఎండీ డా.ఆర్.ఎస్.రెడ్డి, సీజీఎంలు ఎన్.వెంకటరత్నం, రామచంద్రయ్య, ఉద్యోగులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లా రాంప్రసాద్ రెడ్డి రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణకు రాయచోటి నియోజకవర్గ వ్యాపారులు, వర్తక సంఘాల తరఫున రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. మరోవైపు ఏపీలో …
Read More »
amaravatinews
November 4, 2024 అంతర్జాతీయం
147
ఇండోనేసియాలో మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలో ఉన్న ఈ అగ్విపర్వతం గురువారం నుంచి రోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని నుంచి లావా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలు కాలిబూడిదవుతున్నాయి. దీని ధాటికి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. అగ్నిపర్వతం విస్ఫోటనాలు ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని హెచ్చరించారు. అగ్నిపర్వతం విస్ఫోటనంతో విద్యుత్ సరఫరాకు …
Read More »
amaravatinews
November 4, 2024 తెలంగాణ
150
సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం …
Read More »
amaravatinews
November 4, 2024 Business, జాతీయం, బిజినెస్
153
JIO IPO: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మరో రెండు ఐపీఓలు త్వరలోనే స్టాక్ మార్కెట్లలోకి రానున్నాయి. దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు అంబానీ ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. జియో వచ్చే ఏడాది తొలి నాళ్లలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 100 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా మార్కెట్లలోకి అడుగు పెట్టాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్ విభాగం పబ్లిక్ ఇష్యూకు కాస్త …
Read More »