Kadam
July 31, 2025 క్రైమ్, తెలంగాణ
134
మారుమూల గ్రామంలో ఇంటర్నేషనల్ రేంజ్ లో సైబర్ సెటప్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న తీరును చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. నిందితుల వద్ద నుండి 350 సిమ్ లు.. టాస్క్ బాక్స్ లు, సిమ్ ఐఎంఈఐ నెంబర్ లను మార్చే న్యూ టెక్నాలజీ పరికరాలను , ల్యాప్ ట్యాప్ లను సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురును అరెస్ట్ చేసిన పోలీసులు కీలక నిందితుడి కోసంగాలింపు చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోని మారుమూల గ్రామం కలమడుగు కేంద్రంగా పెద్ద ఎత్తున …
Read More »
Kadam
July 31, 2025 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
194
శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్పై దర్శనానికి 3 రోజుల సమయం పడుతోంది. ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆరోజే దర్శనానికి టీటీడీ వీలు కల్పించనుంది. భక్తుల వసతికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో వసతి సమస్యను అధిగమించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భక్తులకు వసతి ఇబ్బందులు రాకుండా ఎన్నో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చేస్తూ …
Read More »
Kadam
July 31, 2025 అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్
132
అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళ మిస్సెస్ ఇండియాగా నిలిచింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డిగారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి వ్యవసాయ కుటుంబం నుంచి మిస్సెస్ ఇండియా అయ్యింది. ఢిల్లీలో వీఆర్పీ ప్రొడక్షన్స్ నిర్వహించిన సీజన్ 5 పోటీల్లో విజయలక్ష్మి మిస్సెస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్పీసీఎల్ డీలర్గా ఉంటుంది. హైదరాబాద్ SBI లో …
Read More »
Kadam
July 31, 2025 ఆంధ్రప్రదేశ్
159
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తన అభిమానాన్ని, అనురాగాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో పలు గిరిజన గ్రామాల్లో సందర్శించిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో రానున్న చలికాలంలో వాళ్లు పడే ఇబ్బందులను గుర్తించి సుమారు ఆరు గ్రామాలకు తన సొంత డబ్బుతో దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తన అభిమానాన్ని, అనురాగాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా …
Read More »
Kadam
July 31, 2025 Jobs, ఆంధ్రప్రదేశ్
149
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక విధానంలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇకపై ఖాళీలకన్నా 200 రెట్లు ఎక్కువ అభ్యర్థులు ఉన్నప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. చాలా పోస్టులకు ఒకే మెయిన్స్ పరీక్షతోనే ఎంపిక పూర్తవుతుంది. దీంతో నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని, నిరుద్యోగుల ఖర్చు భారం తగ్గుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా, నియామకాల్లో వేగం పెరిగేలా నూతన మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. …
Read More »
Kadam
July 31, 2025 ఆంధ్రప్రదేశ్
166
మరో ప్రతిష్టాత్మక పధకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ఆగష్టు 15 నుంచి ప్రారంభించనుంది. దానికి సంబంధించిన వివరాలు.. ఫ్రీ టికెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా. సూపర్ సిక్స్లో భాగంగా ఒక కీలకమైన పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో మహిళల ప్రయాణ ఖర్చును తగ్గిస్తూ, ఆర్థిక భారం తక్కువ చేయాలన్న లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 15 నుంచి …
Read More »
Kadam
July 31, 2025 ఆంధ్రప్రదేశ్
138
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలితమేంటి? ఏపీకి ఎంత పెట్టుబడి వస్తుంది? బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది? బలహీనమైన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయా? పెట్టుబడుల అంచనాలు ఎంతవరకు వెళ్లాయి? దీన్ని రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య, ఆర్ధిక వ్యూహంగా చూస్తే.. ముఖ్యమంత్రి పర్యటనతో రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్ ఎంత? ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశాలు ఇవే. చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్, వాణిజ్య శాఖ మంత్రి టాన్ సీ లెంగ్, హోం …
Read More »
Kadam
July 30, 2025 ఆరోగ్యం
188
వర్షాకాలం వచ్చిన వెంటనే ఇళ్లలో దోమల బెడద కూడా మొదలవుతుంది. దోమలతో రాత్రుళ్లు నిద్ర ఉండదు. కుడితే దురద, మంట, జ్వరం వంటి తీవ్ర ఇబ్బందులను కలిగించడమే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సాధారణంగా ప్రజలు దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్ లేదా ద్రవాలను ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఇతర అనారోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.. అందుకే ప్రజలు సహజ పద్ధతులను వెతుకుతుంటారు. పాత రోజుల్లో దోమలను తరిమికొట్టడానికి వేప ఆకులతో పొగబెట్టేవారు. కానీ …
Read More »
Kadam
July 30, 2025 Jobs, జాతీయం
179
ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. 2025లో ఇన్ఫోసిస్ సుమారు 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఆ కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల మేజర్ ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ), రీస్కిల్లింగ్పై ప్రధానంగా దృష్టి సారించినట్లు …
Read More »
Kadam
July 30, 2025 ఆంధ్రప్రదేశ్, టెక్నాలజీ
185
సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండని ఆయా కంపెనీల సీవోలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ప్రాంతాల వారీగా సీఎం వారికి వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో …
Read More »