ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఒక బహుమతి ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిన తన ప్రియ మిత్రుడు బిల్గేట్స్కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈమేరకు బిల్గేట్స్పై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇది ఒక అంతర్దృష్టి పూర్వక, ప్రేరణాత్మక పఠనం అవుతుందన్నారు. బిల్గేట్స్కు సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్ బహుమతిగా ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »TimeLine Layout
January, 2025
-
25 January
ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వలలో చిక్కిన మరో యువకుడు.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!
ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఇంట్లో ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది. తాజాగా నంద్యాల జిల్లాలో బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. ఈక్రమంలోనే సదరు యువకుడు రాసిన సూసైడ్ లెటర్ కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది ఘటన.బెట్టింగ్ కాదది..బ్లాక్హోల్..! లోపలికి వెళ్లడమే తప్ప..బయటకు రావడమన్నదే ఉండదక్కడ. వందలు, వేలతో మొదలైన మాయాజూదం..చూస్తుండగానే లక్షలకు చేరుతోంది. ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని.. జేబులు గుల్లవుతాయి. అత్యాశతో కొందరు.. వ్యసనాల బారిన పడి మరికొందరు..ఆన్లైన్ …
Read More » -
25 January
మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి
కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఐదో సోదరి చీటీ సకలమ్మ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు దాదాపు 85 వరకు ఉంటుందని సమాచారం. సికింద్రాబాద్ యశోద …
Read More » -
25 January
కరీంనగర్లో బీఆర్ఎస్కు షాక్.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా
కరీంనగర్లో బీఆర్ఎస్కి బిగ్షాక్ తగిలింది. బీఆర్ఎస్కి కరీంనగర్ మేయర్ సునీల్రావు రాజీనామా చేశారు. శనివారం బీజేపీలో చేరనున్నారు మేయర్ సునీల్రావు. మేయర్తోపాటు మరో 10మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బండి సంజయ్ సమక్షంలో వీళ్లంతా బీజేపీ గూటికి చేరబోతున్నారు బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ మేయర్ సునీల్రావు. BRSలో అవినీతిని భరించలేకే పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ.. ఇతర పనుల్లో అవినీతి జరిగిందని..ఆ అవినీతి నేత పేరును త్వరలోనే వెల్లడిస్తానన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా …
Read More » -
25 January
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆ రోజున ప్రివిలేజ్ దర్శనాలు పలు సేవలు రద్దు
ఫిబ్రవరి 04న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్ర వారం అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.వచ్చే నెల 4న తిరుమలలో జరగనున్న శ్రీవారి రథసప్తమి వేడుకకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. …
Read More » -
25 January
పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?
ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేసి ది బెస్ట్ కాపిటల్ సిటీగా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది . మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తామంటోంది కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణ పనులు వచ్చేనెలలోనే ప్రారంభం కానున్నాయి. అన్నిరకాల పనులకు ఇప్పటికే నిధులను సమకూర్చామంటోంది సర్కార్. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను నెలాఖరులోపు పూర్తిచేస్తామని …
Read More » -
25 January
వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్బై!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. శనివారం(జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదన్న విజయసాయిరెడ్డి, ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం అంటూ పేర్కొన్నారు. నాలుగు …
Read More » -
24 January
అమ్మో.! అక్కడ పోస్టింగా..? అయితే కష్టమేనంటున్న బ్యూరోక్రాట్స్
కొందరికి లక్.. మరికొందరికి బ్యాడ్ లక్.. ఇది టెంపుల్ సిటీ సెంటిమెంట్. పొలిటికల్గా అదృష్టం కలిసి వస్తే బ్యూరోక్రాట్స్కు మాత్రం దురదృష్టం వెంటాడుతోంది. తిరుపతిలో రాజకీయంగా ఆరంగేట్రం చేసిన ఎన్టీఆర్, చిరంజీవి పొలిటికల్గా హిట్ అయితే తిరుపతి ఇక్కడ పోస్టింగ్ చేపట్టిన ఐపీఎస్, ఐఏఎస్లకు మాత్రమే ఫట్ అన్నట్లు పరిస్థితి మారింది. ఆ భయమే ఐఎఎస్, ఐపీఎస్లను వెంటాడుతోంది.తిరుపతి.. టెంపుల్ సిటీ. ఇక్కడ ఉండాలన్నా, అధికారిగా పని చేయాలన్నా ఎంతో మందికి ఇంట్రెస్ట్. ఇక్కడికి వచ్చేందుకు లాబీయింగ్ చేసి మరి తిరుపతి పోస్టింగ్ కోసం …
Read More » -
24 January
సెక్యూరిటీ లేకుండా అమరావతిలో నారా భువనేశ్వరి పర్యటన.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అది కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు, భద్రత లేకుండా రాజధాని ప్రాంతంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే రైతులతో భువనేశ్వరి ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రాజధాని అమరావతిలో నారా భువనేశ్వరి సందర్శన ఆసక్తిని కలిగిస్తోంది. వెలగపూడి రెవెన్యూ పరిధిలో తన నివాసానికి చంద్రబాబు గతంలో కొనుగోలు చేసిన 25 వేల చదరపు గజాల స్థలాన్ని పరిశీలించేందుకు ఆమె నిన్న సాయంత్రం అమరావతి లో పర్యటించారు. త్వరలోనే …
Read More » -
24 January
అయ్యో! ఎంతపని చేశావమ్మా.. అవమానంతో ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య!
మాటిమాటికీ పోలీసులు ఇంటికి రావడం.. అనుమానం, దర్యాప్తు పేరిట భర్తను అరెస్ట్ చేయడం, ఇంట్లో సోదాలు చేయడంతో ఆ ఇల్లాలు గుండె ముక్కలైంది. సాఫీగా సాగుతున్న తమ కాపురంలో పోలీసులు నిత్యం ప్రకంపనలు సృష్టించ సాగారు. దీంతో అవమానం భరించలేక ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి, ఆ తర్వాత తానూ ఉరి కొయ్యకు వేలాడింది ఓ ఇల్లాలు..ఇరు కుటుంబాల్లో పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకుందా జంట. ఇద్దరు పిల్లలతో పచ్చగా సాగుతున్న వీరి కాపురంలోకి కేసుల పేరుతో పోలీసులు చిచ్చుపెట్టారు. ఇంటిని పలుమార్లు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal