ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. క్లాసులు ఎగ్గొట్టేవారిని కాలేజీలకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు హాజరు నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా ఆదేశాలు జారీచేశారు. హాజరు శాతం నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి అని తెలిపారు. ఎవరైనా విద్యార్థులు.. ఏవైనా ప్రత్యేక సందర్భాలుంటే 15 శాతం వరకు …
Read More »TimeLine Layout
October, 2024
-
9 October
అధ్యక్ష పదవి పోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్కు డొనాల్డ్ ట్రంప్ రహస్య ఫోన్ కాల్స్
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్.. హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో రహస్యంగా ఫోన్లో సంభాషణలు జరిపినట్లు తాజాగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. …
Read More » -
9 October
పవన్ కళ్యాణ్తో సినీ నటుడు షాయాజీ షిండే భేటీ.. అద్భుతమైన ఐడియా
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నటుడు షాయాజీ షిండే సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే వ్యాఖ్యానించారు. ఇటీవల తన ఆలోచనను పవన్ కళ్యాణ్తో పంచుకుంటానని ఓ టీవీ కార్యక్రమంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే పవన్ కళ్యాణ్ను కలవడం ఆసక్తికరంగా మారింది. వీరి సమావేశానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ కార్యాలయం ఎక్ (ట్విట్టర్) వేదికగా …
Read More » -
9 October
విజయవాడ దుర్గ గుడిలో భక్తుడి చేతికి పెద్ద గోల్డ్ బ్రాస్లెట్.. అందరి కళ్లు అటువైపే, విలువ ఎంతో తెలుసా!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడి చేతికి ఉన్న బ్రాస్లెట్ అందరినీ ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన రవి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చేతికి పెద్ద బ్రాస్లెట్ ఉంది.. దీని బరువు ఏకంగా 1.300 కిలోలు.. విలువ సుమారు రూ.కోటి పైమాటేనని ఆయన చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై రవి చేతికి ఉన్న ఈ బ్రాస్లెట్ను భక్తులు ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఇవాళ …
Read More » -
9 October
తిరుమలలో హోటల్స్ సీజ్, లైసెన్స్లు రద్దు.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమలలో నిబంధనలు పాటించని హోటల్స్, వాహనాలపై టీటీడీ ఎస్టేట్, రవాణా విభాగాలు చర్యలు తీసుకున్నాయి. తిరుమలలో టీటీడీ ఎస్టేట్ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భక్తులకు అధిక ధరలకు తినుబండాలు విక్రయిస్తూ, పరిశుభ్రత లేని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షాపుల్ని అధికారులు సీజ్ చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండటంతో తనిఖీలు నిర్వహించారు. ముందుగా పీఏసీ- 2 (మాధవ నిలయం) వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక టీ దుకాణం, రెండు ఫ్యాన్సీ షాపులను సీజ్ …
Read More » -
9 October
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వచ్చే కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డుల అంశంపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబాల విభజన, కుటుంబ సభ్యుల చేర్పు, …
Read More » -
8 October
కొండెక్కిన టమాటా, ఉల్లి ధరలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా టమాటా రేట్లు అయితే కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. టమాటా రేంజులో కాకపోయినా.. ఉల్లి కూడా కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. దీంతో కూరగాయలు కొనలేక.. సగటు జీవి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో సగటు జీవికి ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రాయితీపై ఉల్లి, టమాటాలు ప్రజలకు విక్రయించాలని …
Read More » -
8 October
బీఎస్ఎన్ఎల్ నెక్ట్స్ లెవల్ అంతే.. అందుబాటులోకి మరో కొత్త ఫీచర్.. Airtel తర్వాత BSNL మాత్రమే!
BSNL Selfcare App : జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు రీఛార్జ్ ప్లాన్లు పెండటంతో.. ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) ఊపందుకుంది. ఇతర నెట్వర్క్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఇతర కంపెనీల సిమ్లను బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లను సైతం అందిస్తోంది. అంతే కాకుండా.. వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ప్లాన్లను కూడా తీసుకువస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్పై నిరంతరం పని చేస్తోంది. ఎలాగైనా.. ఈ ఏడాది చివరి …
Read More » -
8 October
చెరువుల్లో 386 ఎకరాలు మాయం!
హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన పదేళ్లకాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా.. ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది. మొత్తంగా ఆయా చెరువులన్నింట్లో కలిపి గత పదేళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో …
Read More » -
8 October
చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. రైల్వే జోన్కు ముహూర్తం ఫిక్స్.. ఆ రూట్లో 4 లేన్ల ప్రాజెక్టు..!
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వేళ.. ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. సోమవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన తర్వాత.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టు పనులు, రైల్వేజోన్ శంకుస్థాపన విషయమై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రితో జరిగిన చర్చల విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal