ఏపీకి మరో ఇంటర్నేషనల్ కంపెనీ.. 300 ఎకరాల్లో ప్లాంట్, వెండార్ పార్క్! దశ తిరిగినట్లే..

టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఎంవోయూలు కూడా కుదిరాయి. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఎలక్ర్టానిక్స్ సంస్థ ఎల్‌జీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎల్‌జీతో పాటుగా ఆ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే కొరియా, చైనీస్ సంస్థలు కూడా.. భారతదేశంలో రూ.7000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. రూ.7 వేల కోట్లతో ఎల్‌జీ మూడో ఫ్యాక్టరీ, ఎల్‌జీ వెండార్ పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ. 5000 కోట్లు, విడిభాగాల సరఫరాదారులు రూ.2000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిసింది.

5 వేలకోట్లతో ఎల్‌జీ మెగా ఫ్యా్క్టరీ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం 300 ఎకరాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. అలాగే రూ.2000 కోట్లతో తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఎల్‌జీ వెండార్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎల్‌జీ మెగా ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలో ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలను ఉత్పత్తి చేయాలని ఎల్‌జీ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఎల్‌జీ ప్రణాళికలు అమల్లోకి వస్తే దేశంలోనే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోని భారీ పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.

1997లో ఎల్‌జీ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్ నోయిడాలో, పుణె సమీపంలోని రంజన్‌గావ్‌లో ఎల్‌జీకి రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు మూడో ప్లాంట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపినట్లు తెలిసింది. మరోవైపు శ్రీసిటీలో ఇప్పటికే డైకిన్, హవెల్స్, బ్లూస్టార్ వంటి ఎలక్రానిక్స్ ఉత్పత్తుల సంస్థల ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎల్‌జీ కూడా ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా శ్రీసిటీ మారనుంది.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *