క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ.. బెంగళూరులో తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. అయితే ఈ కొత్త ఎన్సీఏకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (బీసీఈ)గా పేరుపెట్టారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా పలువురు ఇతర ఆటగాళ్లతో కలిసి ఈ సెంటర్ను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
వాస్తవానికి ఇప్పటివరకు జాతీయ క్రికెట్ అకాడమీని.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించేవారు. కానీ తాజాగా కెంపెగౌడ విమానాశ్రయానికి సమీపంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను నిర్మించారు. జాతీయ క్రికెట్ అకాడమీకి హెడ్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ హెడ్గా కొనసాగనున్నాడు.
Amaravati News Navyandhra First Digital News Portal