ఏపీలో కొత్తగా మరో గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. ఈ రూట్‌లోనే 6 లైన్లుగా, అక్కడికి 8 గంటల్లో వెళ్లిపోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు నిర్మించనున్నారు. ఈ మేరకు డీపీఆర్‌ రూపొందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. కేంద్రం ప్రధాన మంత్రి గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హైవేను నిర్మిస్తున్నారు.

ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన డీపీఆర్‌ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఎన్‌హెచ్‌ఏఐ డిసెంబర్‌ చివరి వారానికి కన్సల్టెన్సీని ఖరారు చేస్తుంది. 2025 జూన్‌ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.. ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌ మధ్య మొత్తం 783 కిలోమీటర్లు.. ఆరు లేన్లుగా నిర్మిస్తారు. విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్‌ (ఒడిశా) వరకు ఒక ప్యాకేజీగా.. అలాగే ఖుర్దా రోడ్‌ నుంచి ఖరగ్‌పూర్‌ వరకు మరో ప్యాకేజీ కింద ఈ హైవే ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వి­శాఖపట్నం, భావనపాడు, గోపాల్‌పూర్, కేంద్ర పారా పోర్టులను అనుసంధానిస్తుంది.. ఈ హైవే నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేతో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవా­ణా వేగవంతం అవుతుంది అంటున్నారు.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *