విజయవాడను బుడమేరు వరద ముంచెత్తితే.. అనంతపురంపై పండమేరు విరుచుకుపడింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం దెబ్బకు.. అనంతపురంనకు ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పండమేరుకు పోటెత్తిన వరదతో ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ నీట మునిగింది. విజయవాడ తరహాలోనే వరద దెబ్బకు ఇళ్లన్నీ నీటమునిగాయి.. వాహనాలకు నీటిలో కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వదర ప్రభావి ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు అధికారులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal