కీవ్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీ.. 

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియం వద్దకు చేరుకుని అక్కడ యుద్ధంలో మరణించిన చిన్నారులకు నివాళులర్పించారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు 10 గంటల రైలు ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మోదీ కీవ్ చేరుకున్నారు. కీవ్‌లో భారత కమ్యూనిటీ ప్రజలు మోదీకి భారతీయ సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫోమిన్ బొటానికల్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ. ఈ విగ్రహాన్ని 2020లో మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేశారు.

ఉక్రెయిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ కౌగిలించుకున్నారు. మోదీ, జెలెన్స్కీ కలిసి ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను సందర్శించారు. ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చిన్నారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఈ చిన్నారులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం మారిన్స్కీ ప్యాలెస్‌లో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో ఇద్దరు నేతలు భావోద్వేగానికి లోనయ్యారు.

About amaravatinews

Check Also

హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం.. అడ్డుకుంటామని VHP ప్రకటన

హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకుంది.  మే 4 నుంచి 31వరకు తెలంగాణలో ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలు నిర్వహణకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *