కోట్లలో చీట్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలు.. ఈడీ దర్యాప్తు..

సినిమా: మాలీవుడ్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. ఏకంగా రూ. 220 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాను సౌభిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు.

అయితే ఫిల్మ్ ఇన్వెస్టర్ సిరాజ్ వలియతర హమీద్ తనను నిర్మాతలు చీట్ చేశారని కేసు పెట్టడంతో మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తను ఈ ప్రాజెక్ట్ పై ఇన్వెస్ట్ చేసినప్పుడు.. లాభాల్లో నలభై శాతం వాటా ఇస్తామని ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు దీనికి కట్టుబడి ఉండకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు ఫైల్ కాగా ED దర్యాప్తు చేస్తుంది.

కాగా ఈ కేసులో ఇప్పటికే నిర్మాతలకు నోటీసులు పంపగా ఇప్పటికీ రియాక్ట్ కాకపోవడం విశేషం. దీంతో తాజాగా రెండో సారి కూడా నోటీసులు అందించారు. కనీసం ఇప్పుడు అయినా స్పందిస్తారో లేదో చూడాలి. ఒకవేళ రియాక్ట్ కాకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేయాలి.

About amaravatinews

Check Also

బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలు.. విజేతలకు భారీగా ప్రైజ్‌మనీ.. దరఖాస్తు, అర్హతల వివరాలివే

బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఫెస్టివల్ ను ప్రజలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *