కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో వైఎస్సార్సీపీ నేతలు భేటీ అయ్యారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చిన్నాన్న గోపాల్రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి, ఆయన సోదరుడు మండల పరిషత ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ భేటీ అయ్యారు.
సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచలు, వారి వర్గీయులు సుగవాసిని ఘనంగా సత్కరించారు. ఆకేపాటి బ్రదన్స్ సుగవాసిని కలవడం రాజంపేట నియోజక వర్గంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆకేపాటి సోదరులు త్వరలో వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచలు టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Amaravati News Navyandhra First Digital News Portal