ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!

ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్.

విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చూస్తే పరిసర ప్రాంతాల్లో ఏదో ద్రావణం పడినట్టు కనిపించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విశాఖపట్నంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది.

శుక్రవారం(నవంబర్ 30) రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కళ్ళ మంటలతో ముగ్గురు మహిళల కేకలు పెట్టడంతో.. బస్సును డ్రైవర్ ఆపారు. ప్రయాణికులను హుటాహుటీన హాస్పిటల్‌కు తరలించారు. మిగిలిన ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ ద్రావణం ఎక్కడి నుంచి పడిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వెళ్లే పరిసర ప్రాంతాల్లో ఫోర్ వీలర్ లే ప్రయాణించినట్టు గుర్తించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గిడిజాలకు వెళ్తుంది రూట్ నెంబర్ 28 బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్. ఆ ద్రావణం ఏంటని విషయం ఇంకా నిర్ధారించాల్సి ఉందని, వాటిని ల్యాబ్‌కు పంపుతామని అంటున్నారు పోలీసులు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటన విడుదల చేశారు.

About Kadam

Check Also

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *