విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 4 గంటల్లోనే.. కొత్త రైలు మార్గం, ఈ రూట్‌లోనే!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి సంబంధించి.. రెండు ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణం తగ్గనుంది. విశాఖపట్నం-శంషాబాద్‌ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖాయమైంది. ఈ మార్గాన్ని సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ ప్రతిపాదన చేశారు. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విశాఖపట్నం నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే తుది దశకు వచ్చింది.. ఈ సర్వే రిపోర్ట్ నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు.

ఈ హైస్పీడ్ కారిడార్ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది.. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను కూడా అనుసంధానించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం-హైదరాబాద్‌ మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది.. అదే వందేభారత్‌ 8.30 గంటల్లో వెళుతుంది. ఈ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్‌ చేస్తున్నారు. ఈ కారిడార్ పూర్తయితే.. హైదరాబాద్‌ (శంషాబాద్‌) ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు.

About amaravatinews

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *