ఆంధ్రప్రదేశ్కు వాయుగండం ముప్పు తొలగిపోయిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంతలో మరో ముప్పు ఏపీని వెంటాడుతోంది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లిగా బలపడి తుఫాన్గా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా …
Read More »Tag Archives: andhra pradesh
ఏపీకి కొత్త టెన్షన్.. మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!
ఏపీని వర్షాలు ముంచెత్తాయి.. వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల వర్షానికే జనజీవనం స్తంభించింది. వర్షాలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది. ఈ నెల 6 ,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అది తుఫాన్గా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పక్కాగా క్లారిటీ వస్తుంది అంటున్నారు. వాయుగుండం నుంచి తేరుకోక ముందే మళ్లీ తుఫాన్ టెన్షన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాలు అతి భారీ …
Read More »తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మెగాస్టార్ చిరంజీవితెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తున్నాయని.. వరదల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సోషల్ మీడియా వేదికగా సూచించారు. ‘ తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు …
Read More »ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా …
Read More »ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్డు మూసివేత, ఏడుగురు మృతి
Vijayawada Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. రెండు రోజులుగా ముసురు వానలు కురుస్తుండగా.. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్పై భారీ బండరాళ్లు విరిగిపడటంతో అది …
Read More »ఏపీ కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రస్తావన.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్ డే అంశాలను ప్రస్తావించారు. సెప్టెంబరు ఒకటో తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్లవుతోందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబరు …
Read More »ఏపీలో రేషన్కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి కూడా పంపిణీ, వచ్చే నెల పక్కా
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి సిద్ధమవుతోంది.. ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్తో పాటుగా సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.. రెండు నెలలుగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం …
Read More »ఏపీలో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు బంపరాఫర్..
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని.. పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన)లో భాగంగా …
Read More »తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు మృతి
తిరుమలలో విషాదం జరిగిది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి నడిచి వెళుతుండగా.. గుండెపోటుతో చనిపోయాడు. నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. నవీన్ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు బయలుదేరారు. నడుకుకుంటూ 2,350వ మెట్టు దగ్గరకు రాగానే.. నవీన్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి …
Read More »ఏపీలోని మహిళలకు శుభవార్త.. ఉచిత గ్యాస్ పంపిణీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఎన్నో రోజులుగానో ఎదురుచూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇల్లు లేని …
Read More »