Tag Archives: andhra pradesh

స్పీకర్ పదవైనా వదిలేస్తా కానీ.. ఈ విషయంలో తగ్గేదే లేదు..

Ayyanna Patrudu on Narsipatnam RTC Depot land Private Lease issue: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి అయ్యన్న శైలి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఆయన. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ముక్కుసూటితనం, ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆయన స్టైల్. అయితే తాజాగా చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్తున్నా కూడా వినకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. దర్శన టికెట్లు, గదులు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్ల నవంబరు నెల‌కు సంబంధించిన కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అంతేకాదు నేడు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల …

Read More »

ఏపీలో ఉచిత ఇసుకపై మరో కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలు ఉండవు, సింపుల్‌గా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకురానుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్‌ పాయింట్‌కు సమీపంలో ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు వీలు కల్పించి, లారీలు ఇసుక నిల్వకేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ కొత్త రైలు మార్గంతో బెనిఫిట్, ఈ రూట్‌లోనే!

ఆంధ్రప్రదేశ్‌లోని విలీన మండలాల సమీపంలో రైలు కూత వినిపించబోతోంది. గోదావరికి అవతలి వైపు కొత్త రైలు మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీకి కలిసొస్తుంది. కేంద్రం ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు 200.60 కి.మీ. పొడవుతో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పింది. మొత్తం రూ.4,109 కోట్ల వ్యయంతో ఈ లైను నిర్మాణం కాబోతోంది.. ఒడిశా నుంచి ఈ లైను గోదావరి అవతలి వైపున ఉన్న చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా వస్తుంది.. అక్కడి …

Read More »

ఏపీలో బైక్‌లు నడిపేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై అలా కుదరదు, హైకోర్టు సీరియస్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోడ్డు ప్రమాదాలపై దాఖలైన పిల్‌పై విచారణ జరిగింది. రాష్ట్రంలో హెల్మెట్‌ ధరించని వాహనదారులపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. 99 శాతం మంది హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని తెలిపింది. విజయవాడలో హెల్మెట్‌ ధరించిన వారు కనిపించడం లేదని.. హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేయాలని తామిచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. అంతేకాదు చట్ట నిబంధనలు అమలు చేయడంలో ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హెల్మెట్‌ ధరించనివారికి వారు జరిమానా విధిస్తున్నట్లు తాము …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్‌ కన్సెంట్‌ (సాధారణ సమ్మతి) ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే.. ఏపీ భూభాగంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకునేందుకు, అమలు చేసేందుకు వీలు ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విచారణ అంశాల్లో మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. …

Read More »

వర్షాల వేళ స్కూళ్లకు సెలవులు.. కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో వారం రోజుల పాటు కూడా ఇలాగే కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా వచ్చే నాలుగైదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్టులను ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …

Read More »

జగన్.. నీకా అర్హత లేదు.. కేసీఆర్‌తో కుమ్మక్కై నాశనం చేశావ్: గొట్టిపాటి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి ప్రశ్నించిన వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైఎస్ జగన్‌కు లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది వైఎస్ జగన్‌నేనని ఆరోపించారు. ప్రకాశం జిల్లా నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిశామన్న గొట్టిపాటి రవికుమార్.. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేశారన్నారు. అప్పటి …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వమే ఉచితంగా, మంత్రి కీలక ప్రకటన

ఏపీలో డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. త్వరలో డీఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని.. అన్ని జిల్లా కేంద్రాల్లో మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్‌ విదేశీ విద్య పథకంతోపాటు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని ఎస్సీ సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ అధికారులతో మంత్రిమ సెమినార్, సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి …

Read More »