ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు నిర్వహించనున్నారు. అమరావతి: ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ …
Read More »Tag Archives: chandra babu naidu
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఒక్క ట్వీట్తో అపాయింట్మెంట్..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బిజీ షెడ్యూల్ ఉండే చంద్రబాబు.. ఇటీవలే ఓ ట్వీట్కు రిప్లై ఇచ్చారు. ఆగస్ట్ 13వ తేదీ కలుద్దామంటూ అపాయింట్మెంట్ ఇచ్చారు. అన్నట్లుగానే ఇవాళ మధ్యాహ్నం వారితో భేటీ అయ్యారు. అయితే సీఎం అపాయింట్మెంట్ కోరింది మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘసేవకురాలు సునీతా కృష్ణన్. సునీతా కృష్ణన్ ట్విట్టర్ వేదికగా అపాయింట్మెంట్ అడగగానే ఓకే చేసిన చంద్రబాబు.. చెప్పిన విధంగానే మంగళవారం ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ …
Read More »చంద్రబాబు నిర్ణయంతో బొత్స సత్యనారాయణకు జాక్పాట్.. అనుకున్నదే అయ్యిందిగా!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠరేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటూ కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత హుందాగా …
Read More »ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం
CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …
Read More »తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్.. కోడలికి పార్టీ పగ్గాలు..!?
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో జనసేన, బీజేపీతో జట్టు కట్టి.. వైఎస్స్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో కనుమరుగైన టీడీపీని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఏపీ ఎన్నికల తర్వాత సీఎం హోదాలో తెలంగాణకు వచ్చిన చంద్రబాబుకు.. ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు బైక్ ర్యాలీతో తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. గతంలో టీడీపీలో పని చేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ …
Read More »ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేలు, ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారందరికి శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ వైఎస్సార్సీపీ సర్కారు రద్దు చేసింది అన్నారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని.. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా …
Read More »ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. 53 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయించిదని డిప్యూటీ సీఎం ట్వీ్ట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలుు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పని దినాల …
Read More »చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్.. ఏపీ చరిత్రలో తొలిసారి, ఒక్కరోజులోనే సాధ్యమైంది !
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ రికార్డును అందుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను వరుసగా రెండో నెలలో కూడా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకే పంపిణీ ప్రారంభించగా.. వరుసగా రెండో నెల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజులోనే 97.50 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. …
Read More »శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు.. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు.. అక్కడ చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా.. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక …
Read More »